ప్రభాస్ వీరాభిమానులు నిన్న వెబ్ మీడియాలో చేసిన హడావిడి జూనియర్ అభిమానులకు టెన్షన్ గా మారినట్లుగా వార్తలు వస్తున్నాయి. తమ అభిమాన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమా విడుదలై మూడు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రభాస్ వీరాభిమానులు వెబ్ మీడియాలో తెగ హడావిడి చేసారు. 

‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ కెరియర్ లో ‘మిర్చి’ సినిమా ఒక మైలురాయిగా వర్ణిస్తూ ఫేస్ బుక్ లో ట్విటర్ లో చేసిన హడావిడి అంతాఇంతా కాదు. అయితే ఈ హడావిడి చేస్తూ కొందరు ప్రభాస్ వీరాభిమానులు కొరటాల శివ జూనియర్ తో తీస్తున ‘జనతా గ్యారేజ్’, ‘మిర్చి’ సినిమాకు సీక్వెల్ అని అర్ధం వస్తూ అత్యుత్సాహంతో చేసిన కామెంట్స్ జూనియర్ అభిమానుల దృష్టికి వెళ్ళడంతో టెన్షన్ మొదలైంది అని టాక్.

ఇప్పటికే ‘నాన్నకు ప్రేమతో’ అనుకున్న స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయలేదని బాధ పడుతున్న జూనియర్ అభిమానులు తమ హీరో నటించబోతున్న ‘జనతా గ్యారేజ్’ పై వచ్చిన ఈ కామెంట్స్ చూసి అదిరి పోతున్నారు. ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి సూపర్ హిట్ల తర్వాత కొరటాల శివ ఒక మంచి కథతో సినిమాను తీస్తాడు అనుకుంటే ఆ కథ ‘మిర్చి’ సినిమాకు సీక్వెల్ గా మారితే పరిస్థితి ఏమిటి అని తల పట్టుకుంటున్నట్లు టాక్. 

అయితే ఇది అంతా కొంత మంది జూనియర్ వ్యతిరేకులు ప్రభాస్ అభిమానుల పేరుతో వ్యూహాత్మకంగా చేస్తున్న నెగిటివ్ ప్రచారం అని జూనియర్ వీరాభిమానులు తమలో తాము  సర్ది చెప్పుకుంటున్నారు. అంతేకాదు సాధారణంగా టాప్ హీరోల సినిమాల పై ఇలాంటి రూమర్స్ రావడం సహజమే అని జూనియర్ వీరాభిమానుల వాదన. ఏమైనా ఈ కామెంట్స్ జూనియర్ దృష్టి వరకు వెళతాయి కాబట్టి మరొకసారి తాను నటించబోయే ‘జనతా గ్యారేజ్’ కథ గురించి జూనియర్ ఆలోచిస్తాడేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: