పివిపి నిర్మాణ సంస్థ మహేష్ బాబు సమంత జంటగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మిస్తూనే లేటెస్ట్ గా ఈ సంస్థ రియలిస్టిక్ కాన్సెప్ట్ మూవీస్ నిర్మించే ప్రయత్నాలు చేస్తోంది. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ తో కలిసి నిర్మిస్తున్న సస్పెన్స్ డ్రామా ‘క్షణం' అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో కనపడ బోతోంది.

అయితే ఈ డిఫరెంట్  మూవీని మహేష్ సమంతలు కలిసి ప్రమోట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మధ్య ‘బ్రహ్మోత్సవం’ మూవీ నుండి సమంతను తప్పించారు అని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఈ వార్తలకు చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా ఇలా సమంత మహేష్ లను ఒక వేదిక పై కలుపుతున్నారు అనుకోవాలి. 

ఈ సినిమా ట్రైలర్ ను మహేశ్ సమoతలు కలిసి ఫిబ్రవరి 10న విడుదల చేయబోతున్నారు. రవికాంత్ పేరెపు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 4న విడుదలకాబోతున్న ఈ సినిమా క్రేజ్ పెంచడానికి మహేష్ సమంతలను రంగంలోకి దింపుతున్నారు అనుకోవాలి. 

జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్,లాంటి నటీ నటులు నటిస్తున్న ఈ సినిమాకు అడవి శేష్ కథను అందించడం మరింత అంచనాలను పెంచుతోంది. ఈ మధ్య కాలం లో పివిపి నిర్మాణ సంస్థ నిర్మించిన సినిమాలు అన్ని ఘోర పరాజయం చెందిన నేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్ ను డిఫరెంట్ గా చేసి  హిట్ కొట్టాలని ఈ  సినిమా నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలకు మహేష్ సమంతల హస్తవాసి ఎంత వరకు కలిసివస్తుందో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: