రకుల్ ప్రీత్ కు పెరిగి పోయిన క్రేజ్ వల్ల ఆమె పారితోషికం కూడ కోటి దాటిపోయింది అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. అయితే ఇచ్చిన ఒకేఒక పారితోషికంతో రకుల్ ప్రీత్ ను అటు బన్నీ ఇటు చరణ్ లు తమ సినిమాలకు చాల వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్న ఆశక్తికర విషయానికి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. చరణ్ నటించబోతున్న ‘థని ఒరువన్’ లో హీరోయిన్ ఎవరంటూ గత కొద్ది కాలంగా జరుగుతున్న అన్వేషణకు రకుల్ ఎంపికతో శుభం కార్డు పడింది.
ఒకవైపు ఈసినిమాలో శ్రుతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకుంటారు అని ప్రచారం జరుగుతూ ఉంటే హఠాత్ గా రకుల్ ఎంట్రీ ఇవ్వడానికి కారణం అల్లుఅర్జున్ నటిస్తున్న ‘సరైనోడు’ సినిమా అని టాక్. ‘సరైనోడు’ సినిమాకోసం రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన డేట్స్ లో కొన్నిరోజుల బ్యాలెన్స్ వుండిపోయాయట. ‘థని ఒరువన్' లో హీరోయిన్ పాత్ర చాలా తక్కువ కాబట్టి ఒక ఇరవై రోజుల్లో హీరొయిన్ పాత్ర షూటింగ్ పూర్తి చేయవచ్చు అన్నఆలోచనలతో ప్రత్యేకించి మరొక హీరోయిన్ ను ఎంచుకోకుండా మరో హీరోయిన్ కు ప్రత్యేకించి పారితోషికం ఇవ్వకుండా రకుల్ ‘సరైనోడు’ సినిమాకు ఇచ్చిన డేట్స్ ను అల్లుఅరవింద్ ఇలా వాడేస్తున్నాడని ఫిలింనగర్ గాసిప్.
రామ్ చరణ్ తో ప్రఅల్లుఅరవింద్ తీస్తున ఈసినిమా బడ్జెట్ ను వీలైనంత అదుపులో ఉంచాలని నిర్మాత అల్లుఅరవింద్ వేసిన మాస్టర్ ప్లాన్ లో రకుల్ ఈవిధంగా చిక్కుకుందని ఫిలింనగర్ టాక్. ‘బ్రూస్ లీ’ సినిమా ఘోర పరాజయం చెందడంతో చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధని ఒరువన్’ కొనుక్కున్న బయ్యర్లు ఏవిధంగానూ నష్టపోకుండా ఈసినిమా ప్రొడక్షన్ కాస్ట్ ను తగ్గించి బయ్యర్లకు భారీ రేట్లకు కాకుండా వీనైనంత తక్కువ రేట్లకు ఈసినిమాను అమ్మి అటు బయ్యర్లకు ఇటు తననిర్మాణ సంస్థకు లాభాలు తెచ్చేవిధంగా అల్లుఅరవింద్ ఈమాస్టర్ ప్లాన్ ను రచించాడు అని అంటున్నారు.
ఈవార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ ‘ధని ఒరువన్’ రీమేక్ ను ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా యధాతధంగా ఆ స్టోరీలోని సీరియస్ నెస్ పోకుండా ఎటువంటి ప్రయోగాలకు తావు ఇవ్వకుండా దర్శకత్వం వహించమని చరణ్ దర్శకుడు సురేంద్రరెడ్డికి చాల గట్టిగా చెప్పినట్లు టాక్..