తనీ ఒరువన్ సినిమాలో హీరోయిన్ గా ఎవరు ఉంటారు అనే ప్రశ్న చాలా కాలం నుంచీ నడుస్తోంది దీనికి ఇప్పుడు పెద్ద చెక్ పడింది. బ్రూస్ లీ తో రాం చరణ్ తో కలిసి ప్లాప్ లో పాలు పంచుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి సై అన్నారు నిర్మాతలు. ప్రస్తుతం ఆమె సరైనోడు సినిమా షూటింగ్ లో అల్లూ అర్జున్ తో బిజీ గా ఉండగా రకుల్ డేట్ లో ఆ సినిమా కోసం ఇచ్చిన వాటిల్లో బ్యాలన్స్ ఉండిపోయాయి అట వాటికోసం పారితోషికం వెనక్కి ఏం తీస్కుంటాం అని అల్లూ అరవింద్ ఆమెని ఈ సినిమాకి వాడేద్దాం అని చూస్తున్నారు.

 

 

 

అన్నట్టు సరైనోడు కీ, తనీ ఒరువన్ రీమేక్ కీ అల్లూ అరవింద్ నిర్మాత. ఈ సినిమా ని తన మేనల్లుడు తో తీస్తున్న అల్లూ అరవింద్ వీలైనంత గా బడ్జెట్ ని కంట్రోల్ చెయ్యాలని చూస్తున్నారట. తన గత అనుభవాలు అన్నీ వాడేసి మరీ సినిమాని ఒక ముప్పై -ముప్పై ఐదు కోట్లలోగా ముగించాలి అనేది ఆయన ఆలోచన గా తెలుస్తోంది. అవసరం అయితే మగధీర లాంటి ఎపిక్ సినిమా కోసం ఎంతైనా ఖర్చు పెట్టిన అల్లూ అరవింద్ అనవసరం అనుకున్న చోట చాలా జాగ్రత్తగా ఉంటారు అని ఈ విషయంలో అర్ధమవుతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: