బాహుబలి మూవీతో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఫాంలోకి వచ్చిన యాక్టర్ రమ్యకృష్ణ. రమ్యకృష్ణ మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పటికీ…తనకు మంచి పేరు తీసుకువచ్చిన మూవీ మాత్రం బాహుబలి మూవీనే. ‘బాహుబలి’ సినిమాలో శివగామి పాత్రలో నటించి అందరినీ ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుంది. దీంతో రమ్యకృష్ణకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందనే చెప్పాలి. రమ్యకృష్ణ లోని యాక్టింగ్ ని తిరిగి ప్రేక్షకులకు చూపించాలని చాలా మంది దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం రమ్యకృష్ణ ఓ రకంగా ఫాంలోకి వచ్చిందనే చెప్పాలి. రమ్యకృష్ణ నటించిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. బాహుబలి, సోగ్గాడే చిన్నినాయన వంటి సక్సెస్ లు రమ్యకృష్ణ కి వరుస ఆఫర్స్ ని తెచ్చిపెట్టే విధంగా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కృష్ణవంశీ చేయనున్న ఓ హర్రర్ సినిమాలో కృష్ణవంశీ కీ రోల్ పోషించేందుకు సైన్ చేసిందనే విషయం తెలిసిందే.

కృష్ణవంశీ తలుచుకుంటే మరో ఆర్టిస్ట్ ని ఇందులో పెట్టవచ్చు. కానీ రమ్యకృష్ణ కంటే బెటర్ ఆర్టిస్ట్ కి తనకి దొరక్కపోవటంతో…చేసేది లేక రమ్యకృష్ణ నే ఆ పాత్రకి తీసుకోవలసి వచ్చింది. ఇక రుద్రాక్ష సినిమాలో రమ్యకృష్ణ మునుపెన్నడూ చేయని పాత్రలో కనిపించనుంది. ఈ హర్రర్ సినిమాలో రమ్యకృష్ణ దెయ్యం పాత్రలో కనిపించనుంది. అయితే ఈ మూవీకి తను తీసుకునే రెమ్యునరేషన్ సైతం భారీగానే ఉంది. సాధారణంగా రమ్యకృష్ణ 40 లక్షల నుండి 80 లక్షల వరకూ తీసుకుంటుంది.

కానీ రుద్రాక్ష మూవీకి దాదాపు కోటి యాభై లక్షల రూపాయలను తను తీసుకుంటున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ రమ్యకృష్ణ పవర్ఫుల్ లేడీ, భక్తిరస చిత్రలలో నటించింది. కానీ దెయ్యం పాత్రలో తను కనిపించలేదు. అనుశాక్ మెయిన్ లీడ్ లో నటించనున్న ఈ సినిమాలో సమంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించనున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: