ప్రస్తుతం త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న మూవీ అ..ఆ. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ బయటకు వచ్చింది. దీంతో మూవీ షూటింగ్ ఓ వైపు జరుగుతుంటే, మరోవైపు మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం మొదలు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీలో నెగిటివ్ టాక్ మొదలైంది.

దీంతో త్రివిక్రమ్ మార్కెట్ పై  డామేజ్ జరక్కుండా ఉండేందుకు, తన తదుపరి మూవీని స్టార్ హీరో అల్లు అర్జున్ తో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తోన్న'సరైనోడు' సినిమా ఏప్రిల్లో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత అల్లుఅర్జున్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నాడు. అయితే విక్రమ్ కుమార్ సినిమా కంటే ముందుగానే త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల్లుఅర్జున్ మూవీ సెట్స్ మీదకు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఆ తరువాత ఈ సంవత్సరం చివరిలో విక్రమ్ కుమార్ తో మూవీని చేయనున్నాడు. త్రివిక్రమ్ చేస్తోన్న 'అ ఆ ' సినిమా సైతం ఏప్రిల్లో రిలీజ్ కానుంది. అలాగే త్రివిక్రమ్ సూర్యతో చేయనున్న సినిమా తాజాగా వాయిదాలో పడిందని అంటున్నారు. దీంతో అనూహ్యాంగా త్రివిక్రమ్, అల్లుఅర్జున్ ల కాంబినేషన్ లో త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళే ఛాన్స్ ఉందని అంటున్నారు.

త్రివిక్రమ్ ఎప్పుడైతే నితిన్ లో మూవీని స్టార్ట్ చేశాడో, ఈ ప్రాజెక్ట్ కి మొదటి నుండి అడ్డంకులే తగులుతున్నాయి. ఈ మూవీ తరువాత తన మార్కెట్ పడిపోకుండా ఉండేందుకు, వెంటనే ఓ స్టార్ హీరో మూవీ అయితేనే బాగుంటుందని త్రివిక్రమ్ భావించాడు. అందుకే త్రివిక్రమ్, అల్లుఅర్జున్ కాంబినేషన్ కి ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ ఇద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి హిట్స్ వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: