మెగా ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు హీరోలు ఇప్పుడు కాస్త సినిమాల విషయంలో ఒకరికి ఒకరు పోటీ పడేలా పరిస్థితి తయారయ్యిందని ఫిల్మ్ నగర్ టాక్. ఓ సెపరేట్ స్టైల్ తో సినిమాలు తీస్తే తప్ప మిగతా హీరోలందరికి ఓ మెగా కుర్రాడు మరి ఇబ్బందిగా తయారయ్యాడని తెలుస్తుంది. ఇంతకీ దెబ్బాలాడుతున్న మెగా హీరోలు ఎవరో తెలియాలంటే వివరాలు చూడాల్సిందే..


మెగా పవర్ స్టార్ రాం చరణ్.. దాదాపు తన సినిమా కెరియర్లో ఎన్నడు లేని కన్ ఫ్యూజన్ బ్రూస్ లీ ఫ్లాప్ తో ఏర్పడేలా చేసుకున్నాడు. అయితే సినిమా ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త పడేలా ప్లాన్ చేసుకున్నా మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తనకు అడ్డుగా మారాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఫుల్ క్రేజ్ మీదున్న సాయి రాం చరణ్ చేయాల్సిన ఓ కన్నడ రీమేక్ సినిమాను చేస్తున్నాడు.


కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి సినిమా మొదట చెర్రి చేద్దామనుకున్నా ప్రస్తుతం టైం బ్యాడ్ నడుస్తుంది కాబట్టి వద్దనేశాడట. అయితే ఇదే టైం మంచిందని గ్రహించిన సాయి ధరం తేజ్ ఏదైతే చరణ్ వద్దన్నాడో ఆ సినిమాలో తను నటిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలు తిక్క, సుప్రీం కంప్లీట్ చేసి రామాచారి సినిమా మొదలెడతాడట సాయి.


అసలు చరణ్ చేయాల్సిన సినిమా సాయి ధరం చేయాలనుకోవడం అంటే చెర్రి తాను ఒకటే అనే ఫీలింగ్ లో ఉన్నాడా లేక ఈ సినిమా హిట్ కొట్టి తన నిర్ణయం తప్పు అని చెప్పాలనుకున్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సాయి తీసుకునే నిర్ణయాలతో చెర్రికి పక్కలో బల్లెంలా తయారయ్యాడని మాత్రం చెప్పొచ్చు. చరణ్ మాత్రం ఈ నెల 10న తాని ఒరువన్ తెలుగు రీమేక్ ముహూర్తం పెట్టుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: