మొన్నామధ్య వరకూ కాస్త డల్ గా ఉన్న మాస్ మహారాజా ఇప్పుడు ఫార్మ్ లోకి ఒచ్చేసాడు. ఒక్క కిక్ 2 సినిమా పక్కన పెడితే వరసగా చాలానే హిట్ లు అందుకున్నాడు మనోడు. బలుపు, పవర్ , బెంగాల్ టైగర్ ఇలా మాగ్జిమం హిట్ జోన్ లో వెళుతున్నాడు. ఇప్పుడు రవితేజ సినిమాల కోసం నిమ్రాతలు ఎగబడుతూ ఉండగా వారు అందరికీ రవితేజ ఊహించని షాక్ ఇచ్చి మరీ వెనక్కి పంపిస్తున్నాడట. 

 

 

 

రవితేజ హీరో గా ఓహ్ మై ఫ్రెండ్ ఫేం  డైరెక్టర్ వేణూ శ్రీ రాం సినిమా ఒకటి అనుకున్న్నారు దిల్ రాజు నిర్మాత అయిన ఈ సినిమా సడన్ గా కారణాలు లేకునా ఆగిపోయింది . దీనికి రవితేజ అడిగిన భారీ పారితోషికమే కారణం అనే అప్పట్లోనే వార్తలు వచ్చాయి కూడా. ప్రస్తుతం చక్రి అనే కొత్త డైరెక్టర్ తో రాబిన్ హుడ్ పేరుతో ఒక సినిమా చేస్తున్నాడు రవి. ఈ సినిమా కి రాశీ ఖాన్నఓకే అయ్యింది అన్న విషయం మనం ఇదివరకే తెలియజేసాం కూడా. ఈ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ఇరకాటం లో పడే అవకాశం ఉంది అంటున్నారు.

 

 

 

కనీసం 9 కోట్ల పారితోషికం ఇస్తేనే కానీ సినిమా ని మొదలు పెట్టే సమస్య లేదు అంటున్నాడు మాస్ మహారాజా. పవన్ కళ్యాణ్  లాంటి అగ్ర హీరో లాగా ప్రొడ్యూసర్ లు సినిమా వాటాల్లో షేర్ ఇస్తాము అన్నా కూడా రవితేజ ఒప్పుకోవడం లేదట. రవితేజ కి ఈ డబ్బు పిచ్చి ఏంటో అంటూ ఫిలిం నగర్ లో టాక్ నడుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: