పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. జనవరి నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఏప్రిల్ 8న రిలీజ్ కి రెడీ అవుతంది. ఇక ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో, చిత్ర యూనిట్ లోనూ టెన్షన్ మొదలయింది.


ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో కొన్ని సీన్స్ ని రీ టేక్ కూడా చేశారు. దీని కారణంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ షూటింగ్ అనుకున్న సమయం కంటే కొంత ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో రిలీజ్ సమయానికి సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటుందో ? లేదో? అని చిత్రయూనిట్ లో పవన్ కళ్యాణ్ భారీ మార్పులు తీసుకువచ్చాడు. 


ఈ సినిమాని అనుకున్న టైంకి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్ర టీం రెండు యూనిట్స్ గా డివైడ్ అయ్యి పని చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు యూనిట్స్ సినిమా షూట్ ని ఫినిష్ చేస్తున్నాయి. ఒక యూనిట్ పవన్, కాజల్ లపై సాంగ్ షూట్ చేస్తున్నాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే కీలక సన్నివేశాలను కేరళలో షూట్ చేస్తున్నరు. ఈ యూనిట్ కి డైరెక్టర్ గా బాబీ ఉంటున్నడు. మరోవైపు రెండో యూనిట్ హైదరాబాద్ లో పని చేస్తుంది.


ఈ యూనిట్ ఎక్స్ టీరియర్ షాట్స్ ని పూర్తి చేస్తుంది. ఎరోస్ వారు వరల్డ్ వైడ్ రైట్స్ ఈ మూవీని భారీ రేటుకి కొన్నారు. దీంతో మూవీని అనుకున్న టైంకి రిలీజ్ చేయటం తప్పితే పవన్ కి మరోదారి కనిపించటం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ లో టెన్షన్ మొదలై…మరో యూనిట్ ని పెంచాడని తెలుస్తుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా సర్ధార్ గబ్బర్ సింగ్ అనే మూవీ ఇండస్ట్రీలో సర్క్యులేట్ అవుతూ వస్తుంది. ఏట్టకేలకు మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీని రిజల్ట్ ఏంటి అనేది చూడవచ్చిని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: