ప్రస్తుతం స్టార్ యాక్టర్ సాయి కుమార్ సినిమాల్లో నటించటమే కాకుండా, వరుస సినిమాలను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడనే సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే,ప్రముఖ నటుడు సాయికుమార్ తాజాగా ఓ మూవీని తెరెకెక్కించిన విషయం తెలిసిందే. తన వారసత్వాన్ని అందిపుచ్చుకొని హీరోగా వచ్చిన ఆది, ‘గరం’ సినిమాతో రిలీజ్  కి సిద్ధంగా ఉన్నాడు.


దర్శకుడిగా,రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మదన్…ఈ గరం మూవీని డైరెక్ట్ చేశాడు. ఫిబ్రవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ మూవీని స్వయాన సాయికుమార్ తన సొంత బ్యానర్‌పై నిర్మించడం విశేషం. తమ సంస్థలో మొదటిసారిగా ఒక సినిమా రానుండడం పట్ల సాయికుమార్ చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు. ఈ మూవీ తరువాత వరుసగా తను మూవీలను నిర్మించే అవకాశం ఉందని అంటున్నారు.


దాదాపు సంవత్సారానికి కనీసం రెండు నుండి మూడు చిత్రాలను నిర్మించాలని సాయికుమార్ ప్లానింగ్ వేసుకుంటున్నాడంట. అయితే ఓ మూవీని నిర్మించాలంటే సాధారణ హీరోతో అయితే కనీసం15 కోట్ల రూపాయలు అవుతాయి. ఇక సాయికుమార్ వరుస మూవీలను నిర్మించాలని భావిస్తున్నాడు కాబట్టి…కనీసం ఓ యాభై కోట్ల రూపాయలు అయిన ఇందుకు కేటాయించుకొని ఉండాలి.


ఇక సాయికుమార్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడంతో… తన ప్లానింగ్స్ ని చూసిన కొందరు…సాయికుమార్ ఇంత డబ్బు ఎప్పుడు సంపాదించాడు? అని మాట్లాడుకుంటున్నారంట. మొత్తంగా సాయికుమార్ నిర్మాణ సంస్థ ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక గరం మూవీలో ఆది సరసన అదా శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: