బాలీవుడ్ లోకి ఫోర్ప్ స్టార్ సన్నీలియోన్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అయ్యింది. అయితే మొదట్లో ఈ అమ్మడి సినిమాలంటే బాలీవుడ్ చాలా మంది ఆడవాళ్లు వ్యతిరేక చూపించారు..ఇందులో సినీ నటీమణులు కూడా ఉన్నారు.బాలీవుడ్ లో తన నాలుగేళ్ల కెరీర్ లో ఎన్నో అవమానాలు, ఆరోపణలు ఎదుర్కుంటూ వచ్చిన సన్నీలియోపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆమెపై మరో కేసు నమోదైంది. ఇటీవలే ఆమె నటించిన మస్తీజాదే సినిమా విడుదలైంది..వాస్తవానికి ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే ఎన్నో సెన్సేషన్స్ క్రియేట్ చేసింది.

సెన్సార్ బోర్డు నుంచి తిరస్కరణ తర్వాత ఓకే కావడం..సన్నీ న్యూడ్ గా నటించిందని పుకార్లు రావడం ఇలా ఎన్నో ఆసక్తికర వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ చిత్రంలో ఒక మతం వారి మనోభావాలని గాయపరిచేవిధంగా ఉందంటూ కేసు నమోదైంది. ప్రధాన నిందితులుగా సన్నిలియోన్, వీర్ దాస్‌లపై, సహ నిందితులుగా సినిమాకు పనిచేసిన వారందరిపైనా కేసు నమోదైంది. ఢిల్లీలోని ఆదర్శనగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది.

ఎవరు పెట్టారన్న సంగతి ఇంకా తెలియరాలేదు. ఆ సినిమాలో ఓ గుడిలో కండోమ్ ఉపయోగాన్ని చెప్పే సీన్‌లో సన్నిలియోన్, వీర్ దాస్ నటించిన సన్నివేశం ఉంది. ఆ సీన్ వల్లే ఈ వివాదం చెలరేగింది. కాగా ఈ చిత్రం విడుదలై రెండు వారాలు అవుతుండగా రివ్యూ బాగాలేదని చెప్పినప్పటికీ విపరీతమైన కలెక్షన్లు మాత్రం బాగా వస్తున్నాయి. మరి సన్నీలియోన్ ఈ కేసుపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: