సూపర్ స్టార్ మహేష్, సమంత చేతుల మీదుగా అడివి శేష్, అదా శర్మ జంటగా నటించిన క్షణం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఓ స్టార్ హీరో వచ్చి ట్రైలర్ రిలీజ్ చేస్తే ఆ సినిమా మీద హైప్ వస్తుంది అన్న అవగాహనతో ఈరోజు క్షణం ట్రైలర్ కూడా అలానే రిలీజ్ చేశారు. మొన్నామధ్య పోస్టర్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన క్షణ టీం ఇప్పుడు ట్రైలర్ తో కూడా వారెవా అనేలా చేస్తుంది.


ప్రస్తుతం సినిమాల మధ్య ఏర్పడ్డ ఈ పోటీలో టాలెంట్ ఉన్న దర్శకులు తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా డైరక్టర్ రవికాంత్ కూడా తన ప్రతిభను ఓ ట్రైలర్ లో చూపించి ఇంప్రెస్ చేశాడు. ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ సినిమా తప్ప విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక సమంత అయితే ట్రైలర్ సూపర్బ్ అనేసింది.


పివిపి బ్యానర్లో పరం వి పొట్లూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఓ కిడ్నాప్ డ్రామాగా సాగుతుంది. క్షణం అనే టైటిల్ కూడా ఈ సినిమాకు ఎంతో యాప్ట్ అనే విధంగా ట్రైలర్ ఉంది. అడివి శేష్, అదా శర్మలతో పాటుగా హాట్ యాంకర్ అనసూయ కూడా ఈ సినిమాలో ఓ స్పెషల్ పాత్రలో నటిస్తుంది. సోగ్గాడిలో మరదలిపిల్లలా చిందేసిన అనసూయ ఈ సినిమాలో పోలీస్ పాత్రలో కనబడనుంది.


రిలీజ్ అయిన ట్రైలర్ మాత్రం సినిమాలో మంచి విషయం ఉంది అన్న ఫీల్ ను కలిగిస్తుంది. మరి భారీ సినిమాలను తీస్తున్నా భారీ విజయాన్ని అందుకోని పివిపి బ్యానర్ కు చిన్న ప్రయత్నంగా చేసిన ఈ క్షణం సినిమా అయినా సూపర్ హిట్ అయ్యి మంచి వసూళ్లను తీసుకురావాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: