సుకుమార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ల స్నేహం ఈనాటిది కాదు. సుకుమార్ ‘ఆర్యా’ సినిమాతో మొదలైన వీరి కాంబినేషన్ సుకుమార్ కు సంబంధించిన ప్రతి సినిమాలోను కొనసాగుతూనే ఉంది. సుకుమార్ సినిమాలు కొన్ని పరాజయం చెందినా దేవిశ్రీ సుకుమార్ సినిమాలకు ఇచ్చిన పాటలు ఎక్కడా ఫెయిల్ కాలేదు. ఇంత స్నేహం ఉన్న వీరిద్దరి కాంబినేషన్ లో దేవిశ్రీని హీరోగా చేస్తూ సుకుమార్ తీయబోతున్న సినిమాకు అనుకోని అడ్డంకులు ఏర్పడుతున్నాయని టాక్. 

ఇప్పటికే ఈసినిమా కథకు సంబంధించి సుకుమార్ ఒక క్లారిటీ వచ్చి ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ ను పరుగులు పెట్టిస్తున్న నేపధ్యంలో మెగా కాంపౌండ్ ఒత్తిడితో సుకుమార్ ముందు చరణ్ తో సినిమా చేసి ఆ తరువాత దేవిశ్రీ ప్రసాద్ ను హీరోగా చేసే మూవీకి శ్రీకారం చుట్టాలని సుకుమార్ లేటెస్ట్ గా నిర్ణయం తీసుకున్నట్లు టాక్.

‘నాన్నకు ప్రేమతో’ విడుదల తరువాత సుకుమార్ దేవీశ్రీల సినిమాకు సంబంధించి ప్రకటన విడుదల అయినా ఆ తరువాత ఊహించని విధంగా మెగా కాంపౌండ్ నుండి చరణ్ సినిమా విషయమై ఒత్తిడి పెరిగి పోవడంతో ప్రస్తుతానికి దేవిశ్రీ సుకుమార్ ల సినిమా కొంత కాలానికి వాయిదా పడినట్లే అని అంటున్నారు. 

దీనికితోడు దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తుతం ఒప్పుకున్నా సినిమాల సంఖ్య కూడ చాల హెచ్చుగా ఉండటంతో ద్రేవిశ్రీ సుకుమార్ లు కలిసి ఇద్దరూ కలిసి తాత్కాలికంగా ఈసినిమాను వెనుకకు జరపడం మంచిది అన్న అభిప్రాయానికి వచ్చినట్లు ఫిలింనగర్ గాసిప్. ఈ వార్తలు ఇలా ఉండగా ఈమధ్యనే సుకుమార్ రామ్ చరణ్ ను కలిసి చెప్పిన లైన్ కు అతడు ఓకె చెప్పడంతో ఇప్పుడు ఆ లైన్ డెవలప్ చేసే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నాడని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: