ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ ఉన్న నిర్మాతల్లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఒకరు అంటూ చెబుతారు. కానీ నిజానికి బండ్ల గణేష్ ఎటువంటి ఆర్ధిక ఇబ్బందుల్లో లేరని అంటున్నారు. తను సేఫ్ జోన్ లోనే ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గతంలో బండ్ల గణేష్ భారీ చిత్రాలను తెరకెక్కించి ఇండస్ట్రీని ఓ ఊపు ఊపారు. ఆ తరువాత అనూహ్యంగా మళ్ళీ తెరపై ఎక్కడా కనిపించలేదు.

బండ్ల గణేష్ ఒక్కసారిగా మూవీలని తగ్గించేసరికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ బడా నిర్మాతపై లేని పోని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బండ్లకి అప్పులు పెరిగిపోయాయని, కోర్టుకేసుల్లో ఇరుకున్నారని వంటి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉందనేది కూడ అనుమానంగానే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బండ్ల గణేష్ మళ్ళీ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. చాలా గ్యాప్ తరువాత తను మూవీకి సంబంధించిన రిమేక్ రైట్స్ ని చేజిక్కించుకుని మళ్ళీ తన హావాని చూపించాలని కోరుకుంటున్నాడు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ‘టెంపర్’ తో సూపర్ హిట్ అందుకున్న బండ్ల గణేష్ ఆ తర్వాత ఒక్క సినిమాని కూడ సెట్స్ మీదకు తీసుకురాలేదు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘2 కంట్రీస్’ అనే సినిమా పై బండ్ల గణేష్ మనస్సు పడ్డాడు. ఈ సినిమా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి దాదాపు 50 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో బండ్ల ఈ సినిమా రీమేక్ పై పడ్డాడు.  తాజాగా బండ్ల గణేష్ ‘2 కంట్రీస్’ రీమేక్ రైట్స్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయాన్ని తను ఎక్కడా బయటకు చెప్పుకోవటం లేదు. అయితే ఈ మూవీని భారీ తారాగణంతో తెరకెక్కించాలా? లేదా? అనే సందేహంలో బండ్ల గణేష్ ఉన్నారంట. అంతే కాకుండా గతంలో మాదిరి తన మూవీకి భారీ పబ్లిసిటినీ దక్కించుకునేందుకు బండ్ల కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసేవాడు. కానీ ప్రస్తుతం అలాంటివి బండ్ల గణేష్ చేయాటానికి కొద్దిగా బయటపడుతున్నాడని అంటున్నారు. ఈ గ్యాప్ లో బండ్ల గణేష్ ఎందుకు బయపడుతున్నాడనే విషయం ఇప్పడు ఇండస్ట్రీలో చర్ఛనీయాంశంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: