ఈ మధ్య కాలంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలు, స్టార్ డైరెక్టర్ మణిరత్నం కి ఝలక్ మీద ఝలక్ ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని చాలా మంది యాక్టర్స్ మణిరత్నం సినిమాలో నటించాలనే కోరిక మీద ఉంటారు. మణిరత్నం ఓకే బంగారం మూవీతో మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. ఈ మూవీ తరువాత నిజానికి మణిరత్నం, నానితో సినిమాని చేయాలి.


ఈ విషయం స్వయంగా నాని చెప్పటంతో తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘మణిరత్నం గారు నాతో ఓ సినిమా అనుకున్నారు. అయితే ఓ బాలీవుడ్ మూవీకి, ఈ కథకి పోలిక ఉండడంతో ఆ సినిమాని ఆపేయాల్సి వచ్చింది. కానీ ఆయన నాతో సినిమా చేస్తానని చెప్పాడు.’ నాని అన్నాడు. అయితే మణిరత్నం మాత్రం బాలీవుడ్ లో వచ్చిన కథకి తను అనుకున్న కథ ఒకలా ఉండటంతో మళ్ళీ కథని రీ డిజైయిన్ చేస్తానని చెప్పుకొచ్చాడంట.


అందుకు నాని తన దగ్గర అప్పటికే కాల్షీట్స్ బిజిగా ఉన్నాయని చెప్పుకొచ్చాడంట. మళ్ళీ కొత్త కథ అంటే దానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు కమిట్ అయిన మూవీలను పూర్తి చేయాలని చెప్పుకొచ్చాడంట. దీంతో మణిరత్నం చెప్పాపెట్టకుండా నానితో తన కమ్యునికేషన్స్ కి స్టాప్ చెప్పాడంట. మణిరత్నం లాంటి డైరెక్టర్ మూవీకి రెడీగా ఉంటే..కమిట్మెంట్స్ అంటూ నాని చెప్పిన రీజన్..మణిరత్నంకి కోపం  తెప్పించిందని అంటున్నారు.


దీంతో నాని ఇచ్చిన ఝలక్ కి మణిరత్నం…నానితో ఇప్పట్లో టచ్ లోకి వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇక నాని ప్రస్తుతం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’సినిమాపై భారీ అంచానలు పెట్టుకున్నాడు. ఈ మూవీ ఫిబ్రవరి 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: