ప్రస్తుతం బుల్లితెర హవా బాగా పెరిగి పోవడంతో యాంకర్స్ చేసే కామెంట్స్ కూడ చాల హాట్ న్యూస్ గా మారిపోతున్నాయి. ఉదయభాను, సుమ, ఝాన్సీల తరువాత ఎందరో యాంకర్స్ వచ్చినా వారిలో బాగా పేరు తెచ్చుకున్న లిస్టులో యాంకర్ శ్యామల కూడ ముందు వరసలో ఉంటుంది. అనసూయ రేష్మీల అంత హాట్ యాంకర్స్ గా ఈమెకు క్రేజ్ లేకపోయినా బుల్లితెర ప్రేక్షకులలో ఈమె పేరు తెలియని వారుండరు. 

ఈమెకు ఎక్కువగా  హోమ్లీ యాంకర్ ఇమేజ్ సంపాదించుకుంది. ఈమె కూడ అనసూయ రేష్మీల అంత స్పీడ్ కాకపోయినా కొన్నికొన్ని సినిమాలలో చిన్న పాత్రలు చేస్తోంది. అయితే అనసూయ రేష్మీలను ప్రధాన పాత్రలుగా చేసి సినిమాలు వస్తున్నా ఈమెకు అటువంటి అవకశాలు ఇవ్వడం లేదు. ఈమధ్య విడుదలైన ‘బెంగాల్ టైగర్’ సినిమాలో హీరో వదిన పాత్రను ఈమె పోషించింది. 

అయితే ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది అని టాక్. మీతోటి యాంకర్లు అంతా హీరోయిన్ పాత్రలు ఐటమ్ సాంగ్స్ చేస్తూ దూసుకు వెళుతూ ఉంటే మీరు అటువంటి పాత్రలు చేయరా ? అని ఒక మీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు శ్యామల షాకింగ్ సమాధానం ఇచ్చిందని తెలుస్తోంది. 

తాను కూడ అటువంటి పాత్రలు చేయాలి అంటే గతంలో తనకు ఐటమ్ సాంగ్ అవకాశాలు ఎన్నో వచ్చాయి అని అంటూ డీసెంటుగా ఉండే పాత్రలే చేస్తాను అని సమాధానం ఇచ్చిందట. దీనితో అక్కడ ఉన్న మీడియా వర్గాలు శ్యామల టార్గెట్ చేసింది ఎవరిని అని చర్చించుకున్నారట. ఈ సందర్భంలో కొందరు మీడియా ప్రతినిధులు అయితే శ్యామల టార్గెట్ చేసింది అనసూయ రేష్మీలనే అని అనుకుంటూ గుసగుస లాడుకున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: