అలా..ఎలా..? సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ హెభా పటేల్.. సుకుమార్ రైటింగ్స్ లో అను చేసిన రెండో సినిమా కుమారి 21ఎఫ్ అమ్మడిని ఎక్కడికో తీసుకెళ్లింది. హెభా పటేల్ సినిమా ఓకే అన్నప్పుడు ఇంత క్రేజ్ ను ఊహించి ఉండదు. సినిమా ప్రేక్షకులను ముఖ్యంగా కుర్ర కారుని ఉర్రూతలూగించింది. ఇక కుమారి అందాలకు యూత్ అంతా ఫిదా అయ్యారు లేండి..


ఆ సినిమా ఇచ్చిన జోష్ తో కుమారిని వరుస సినిమాల్లో తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఆఫర్ వచ్చిందికదా అని అమ్మడు కూడా రెచ్చిపోతుంది. ప్రస్తుతం మంచు విష్ణు, రాజ్ తరుణ్ సినిమాలో మరోసారి రాజ్ కు జోడీగా నటిస్తున్న ఈ భామ.. చంద్ర శేఖర్ ఏలేటి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న త్రిభాషా చిత్రంలో చాన్స్ కొట్టేసిందట. 


అంతేకాదు వినాయక్ దగ్గర దర్శకత్వ పాఠాలు నేర్చుకుని డైరక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్న ఓ నూతన దర్శకుడి దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా కుమారి నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం ఫుల్ క్రేజ్ మీదున్న కుమారి కోసం దర్శక నిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. తన క్యూట్ నటనతో.. హాట్ ఎక్స్ పోజింగ్ తో సినిమాకు కావాల్సినంత కలరింగ్ ను తెస్తుంది ఈ ముద్దుగుమ్మ.


మిగతా సినిమాలేవో కాని చంద్ర శేఖర్ ఏలేటి డైరక్షన్లో వస్తున్న సినిమాలో మోహన్ లాల్, గౌతమిలతో స్క్రీన్ షేర్ చేస్తుకోవడం నిజంగానే హెభా పటేల్ లక్కీ అని చెప్పాలి. ఒక్క సినిమా అమ్మడి ఫేట్ నే మార్చేస్తే అలా అచ్చిన క్రేజ్ ను పోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది హెభా పటేల్. మరి సుకుమార్ కూడా అమ్మడి కెరియర్ కోసం మరో సినిమా ఆఫర్ ఇస్తున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. సో కు..కు..కుమారి నువ్వే అందరికి కావాలి అని దర్శక నిర్మాతలు వెంటబడటం చూస్తుంటే కుమార్ హెభా పటేల్ స్టార్ క్రేజ్ సంపాధించినట్టే అనిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: