బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు కలెక్షన్స్ సాధించి చరిత్ర సృస్టించిన ‘బాహుబలి’ గురించి ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు ప్రభాస్ దుబాయిలో జరిగిన గామా అవార్డుల ఫంక్షన్ లో ప్రభాస్ నోటి వెంట ఈ మాటలు విని చాలా మంది షాక్ అయ్యారు. ‘బాహుబలి' సినిమాకు గామా బెస్ట్ మూవీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ రావడం చాలా హ్యాపీగా ఉంది అన్న ప్రభాస్ మొట్టమొదట ‘బాహుబలి’ కథ విని అందరం ఒకటే పార్ట్ అనుకున్నామని అయితే కథ మొత్తం పూర్తి అయ్యేసరికి ఆ కథ రెండు పార్ట్ లుగా మారిపోయింది అన్న విషయాన్ని బయట పెట్టాడు. 

దీనితో షాక్ అయిన రాజమౌళి ‘బాహుబలి’ సినిమా ప్రాజక్ట్ ను వదిలేద్దాం అంటూ రాజమౌళి ఈ సినిమా నిర్మాతల పై ఒత్తిడి చేయడమే కాకుండా ఈ ప్రాజెక్ట్ చాల రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అంటూ రాజమౌళి ఈ సినిమా నిర్మాతలకు క్లాస్ పీకిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు బదులు బాక్సింగ్ నేపథ్యంతో ఒక సినిమాను చేద్దామని తనతో రాజమౌళి చెప్పిన విషయాలను కూడ గుర్తుకు చేసుకున్నాడు ప్రభాస్. 

అయితే ఈ సినిమా నిర్మాతలు శోభు యార్లగడ్డ,  దేవినేని ప్రసాద్ మాత్రం రాజమౌళిని ఎక్కడా నిరుత్సాహ పడకుండా మేమున్నామంటూ ‘బాహుబలి’ కి ప్రాణం పోశారని ఆనాటి విషయాలను లీక్ చేసాడు ప్రభాస్. అంతేకాదు తాను ‘బాహుబలి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నప్పుడు టాలీవుడ్ లోని కొంతమంది తనను చాల అమాయకంగా చూసారని ఆనాటి పరిస్తుతులను బయట పెట్టాడు ప్రభాస్. 

అయితే రాజమౌళి ధ్యైర్యమే తనకు కూడ ఉండటంతో తాము కష్టపడి తీసిన ఈ ‘బాహుబలి’ కి ఈరోజున వస్తున్న గుర్తింపు తనకు ఇప్పటికీ ఉలిక్కి పడేలా చేస్తోంది అంటూ ప్రభాస్ చేసిన వ్యాఖ్యలతో ‘గామా’ అవార్డ్స్ ఫంక్షన్ సంచలనంగా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: