బాపు బొమ్మ ప్రణీత అదృష్టవసాత్తు ఒక పెద్ద రోడ్ ప్రమాదం నుండి బయట పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఖమ్మం నుంచి ఆమె హైదరాబాద్ కి వస్తుండగా మోతి అనే గ్రామం దగ్గర  ప్రణీత ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన పడిపోయింది అని తెలుస్తోంది.
 
అయితే  ఆ ప్రమాదం జరిగిన  పరిస్థితి చూసిన వారు మాత్రం ఆ ప్రమాదం నుండి ప్రణిత  బయట పడటం ఆమె అదృష్టం అంటున్నారు. అయితే చిన్నచిన్న గాయాలు మాత్రమే ఆమెకు తగిలినట్లు తెలుస్తోంది.  నిన్న రాత్రి  ఉప్పల్ స్టేడియంలో జరిగిన సీసీఎల్ క్రికెట్ మ్యాఛ్ లో పాల్గొన్న ప్రణీత అందులో ఆటగాళ్లని ఎంకరేజ్ చేస్తూ ఉత్సాహంగా కనిపించింది. 

ఈ రోజు ఉదయమే ప్రణీత ఖమ్మంకు  వెళ్లి అక్కడ జరిగిన ఓ ప్రయివేటు ఫంక్షన్ లో పాల్గొన్న ట్టు  తెలుస్తోంది. ఆ తరువాత ఈ రోజు 2.30 గంటలకి మొదవలవుతున్న సీసీఎల్ ఫైనల్ మ్యాచ్ కి మళ్లీ హాజరయ్యేందుకని వెంటనే ఖమ్మం నుంచి బయల్దేరింది అని తెలుస్తోంది. ఈ హడావిడి లో ఆమె కారు  ఖమ్మం జిల్లా మోతి అనే గ్రామం వద్ద ప్రమాదానికి గురి అయ్యింది .
 
అయితే పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని క్షేమంగా ఉన్నానని అంటూ ఆమె ట్విట్ చేసింది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమా రంగానికి సంబంధించి అనేక దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటున్న సందర్భంలో ప్రణిత  ఎటువంటి  ప్రమాదం లేకుండా బయట పడటంతో ఆమెతో సినిమాలు తీస్తున్న నిర్మాతలు అనందంగా ఉన్నారని టాక్ !


మరింత సమాచారం తెలుసుకోండి: