ప్రస్తుతం టాలీవుడ్ సినిమా రంగంలో దేవిశ్రీ ప్రసాద్ తరువాత క్రేజీ సంగీత దర్శకుడుగా అనూప్ రూబెన్స్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమే కాకుండా టాప్ హీరోల సినిమాలు అన్నింటికి సంగీత దర్శకత్వం వహిస్తూ కెరియర్ పరంగా ముందుకు దూసుకు పోతున్నాడు. అయితే గత సంవత్సరం టాలీవుడ్ ను ఏలుతున్న ఈ ఇద్దరు సంగీత దర్శకుల వ్యక్తిగత జీవితాలలో అనుకోని విషాదకర సంఘటనలు జరిగాయి. 

దేవిశ్రీప్రసాద్ తండ్రి రచయిత సత్యమూర్తి గత సంవత్సరం డిసెంబర్ లో మరణించిన కొద్దిరోజులకే అనూప్ రూబెన్స్ తల్లి మనోహరమ్మ కూడ అనారోగ్యంతో మరణించారు. దీనితో ఒకేసారి ఈ ఇద్దరి సంగీత దర్శకుల వ్యక్తిగత జీవితాలలో పెద్ద షాక్ లు తగిలాయి. అయినా ఈ దురదృష్టకర సంఘటనలకు ప్రభావితం కాకుండా వీరిద్దరూ తాము ఒప్పుకున్నా సినిమాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తూ నిర్మాతలకు సహకరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో దేవిశ్రీప్రసాద్ కు ‘గామ’ అవార్డ్స్ ఫంక్షన్ లో దేవిశ్రీ దర్శకత్వం వహించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’  సినిమాలోని ‘సూపర్ మచ్చి’ పాటకు బెస్ట్ కమర్షియల్ సాంగ్ అవార్డ్ వచ్చింది. ఈ అవార్డును ఈమధ్యన జరిగిన ఫంక్షన్ లో దేవిశ్రీ అందుకుంటూ ఈ అవార్డ్ ను తన తండ్రితో పాటుగా అనూప్ రూబిన్స్ తల్లికి కూడ అంకితం ఇచ్చాడు. 

తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కలిగే బాధ ఏమిటో తనకు తెలుసు అని అంటూ అటువంటి బాధను అనుభవిస్తున్న అనూప్ రూబెన్స్ తో తన బాధను పంచుకుంటూ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను అని దేవిశ్రీ ప్రకటించాడు. దేవిశ్రీ నోటి వెంట ఈమాటలు రాగానే ‘గామ’ అవార్డ్స్ కు వచ్చిన అతిధులు అంతా దేవిశ్రీ సహృదయతను తెగ పొగిడినట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: