స్టయిల్ గా కుర్చీలో కూర్చున్న ఈ కుర్రోడు ఎవరా అనుకుంటున్నారా..? ప్రస్తుతం ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చి దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి...ఇండస్ట్రీలో అందరూ జక్కన్నా అని పిలుస్తారు. తెలుగు సినీ కథారచయిత కె. వి. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. ఇతని పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.

సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేసాడు. తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ యువ దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం ఇతని ప్రత్యేకత. గత సంవత్సరం బాహుబలి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీని ప్రపంచ వ్యాప్తంగా గొప్పగా నిలబెట్టిన ఖ్యాతి రాజమౌళికే దక్కుతుంది.

ఈ చిత్రంలో అప్పటి వరకు అంతంత మాత్రంగా గుర్తింపు ఉన్న హీరో, హీరోయిన్లకు ఎక్కడ లేని స్టార్ ఇమేజ్ వచ్చింది. అంతే కాదు రికార్డు స్థాయిలో 6 వందల కోట్ల కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి 2 చిత్రం షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: