హీరోగా మొదలు పెట్టి ఈరోజు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో తన సత్తాను చాటుతున్న జగపతిబాబు ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆ శక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ టాప్ హీరో బాలకృష్ణ లపై సంచలన వ్యాఖ్యలు చేసాడు.  నేటి తరం ఆర్టిస్టులలో ప్రకాష్ రాజ్ నెంబర్ వన్ అని అంటూ ఆ తరువాత స్థానంలో రాజేంద్రప్రసాద్ రావ్ రమేష్ పోసాని కృష్ణమురళీ ప్రధమ స్థానంలో ఉంటారని చెపుతూ వాళ్ళ స్థానాలు వారికి ఉన్నాయి అంటూ కామెంట్స్ చేసాడు జగపతి బాబు. 

అయితే ఇటువంటి గొప్ప ఆర్టిస్టులు ఉన్నా తన స్థానం తనకు ఉందని తాను ఎవ్వరి గురించి బెదిరి పోవలసిన అవసరం లేదని సంచలన కామెంట్స్ చేసాడు జగపతిబాబు. ఇదే సందర్భంలో నందమూరి బాలకృష్ణ గరించి మాట్లాడుతూ బాలయ్య ముక్కుసూటిగా తన మనసులో ఏముందో అదే మాట్లాడుతాడు కాని చాలామంది హీరోలులా నిజజీవితంలో నటించడం బాలకృష్ణకు చాతకాదు అంటూ కామెంట్స్ విసిరాడు. 

ఒక్క బాలయ్య తప్ప మిగతా హీరోల గురించి తాను ప్రత్యేకంగా ఏమి చెప్పనని దీనికి కారణం తాను అందరి హీరోలతో కలిసి నటించాలి అని కోరుకుంటున్నాను అంటూ తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు జగపతిబాబు. తాను ఒక ఇంట్రావర్ట్ ని అంటూ తన పై తానే కామెంట్ చేసుకున్న జగపతిబాబు ప్రస్థుత రోజులలో నిజాలు చెప్పడానికి భయపడవలసి వస్తుందని అంటూ తాను కమ్మ కులంలో పుట్టినా కమ్మవాళ్ళ గొప్పతనం ఏమిటో తనకు ఇప్పటికీ అర్ధం కాదు అంటూ సంచలన కామెంట్స్ విసిరాడు. 

కులం పేరిట జరిగే ఫంక్షన్స్ ను వనభోజనాలను చూస్తూ ఉంటే మన సమాజం ఎప్పటికీ ఇంతేనా ? అన్న బాధ తనకు ఏర్పడుతోంది అంటూ తన కులం పై కూడ కామెంట్స్ చేసాడు. తనతో నాలుగు సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్న తన స్టార్ ప్రొడ్యూసర్ రాజేంద్రప్రసాద్ చనిపోయినప్పుడు తాను ఏడవలేదని చాలామంది కామెంట్ చేసిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ఎడవాలని రూల్ లేదు కదా బాధను వ్యక్తం చేయడానికి ఏడవడమే కాదు అనేక మార్గాలు ఉన్నాయి అంటున్నాడు ఈ విలక్షణ నటుడు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: