స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ వ్యూహంతో ‘సరైనోడు’ కోలుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాకు సంబంధించి ఊరమాస్ అంటూ టీజర్ వదలడం వల్ల వచ్చిన నష్టాన్ని బన్నీ ఈసినిమా విడుదల అయిన మొదటి రోజునే గ్రహించడంతో ఈసినిమాకు సంబంధించి ఫ్యామిలీ ట్రయిలర్ ను అదేవిధంగా ఒక కామెడీ ట్రైలర్ ను అల్లుఅర్జున్ వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని విడుదల చేయించడంతో ఈసినిమా పరిస్థితి కొంత వరకు మెరుగు పడింది అన్న వార్తలు వస్తున్నాయి.

మొదటిరోజు డివైడ్ టాక్ తో సతమతమైన ‘సరైనోడు’ రెండవ రోజునుండి తెలుగు రాష్ట్రాలలో ఫుల్స్ తో రన్ అవుతున్నాయి. ముఖ్యంగా సీడెడ్ లాంటి చోట్ల మంచి కలెక్షన్లు కనిపిస్తున్నాయి.  నిన్న సండే కూడా ఇదే పరిస్థితి కొనసాగడంతో కష్టాల నుండి ‘సరైనోడు’ బయట పడింది అన్న వార్తలు వస్తున్నాయి. నిన్నటితో మూగిసిన వీక్ ఎండ్ తో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్ల కలక్షన్స్ వచ్చాయని టాలీవుడ్  కలెక్షన్ పండితులు లెక్కలు కడుతున్నారు.

ఈ సినిమాకు వచ్చిన డివైడ్ టాక్ గురించి ఆలోచిస్తూ రోజులు గడపడం కంటే ఈ సినిమాలోని పాజిటివ్ అంశాలను ప్రచారం చేసుకుంటూ వెళ్లడం అవసరం అన్న విషయాన్ని గుర్తించి అల్లుఅర్జున్ తన ప్రచార వ్యూహాన్ని మార్చి నిన్నటి నుంచి మరింత వేగంగా ఛానెల్స్ లో ఈ ‘సరైనోడు’ గురించి ప్రచారం చేయడానికి బన్నీ తన వేగాన్ని పెంచుతున్నాడు అనుకోవాలి. 

ఈ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే ఈ సినిమాకు జరిగిన బిజినెస్ రీత్యా 55 కోట్ల కలెక్షన్స్ రావడం అత్యంత అవసరమైన నేపధ్యంలో ఈ రోజు కలెక్షన్ రిజల్ట్స్ ‘సరైనోడు’ కి కీలకంగా మారనున్నాయి. మరి బన్నీ ఎత్తుగడ ఈ ‘సరైనోడు’ ని ఈ వారం ఎంత వరకు రక్షిస్తుందేమో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: