నేషనల్ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం నిర్వహించే మోస్ట్ డిజైరబుల్ మెన్ సర్వే ఫలితాలు ప్రకటింప బడ్డాయి. 25 మందితో కూడిన ఈలిస్టులో అనేక సర్ప్రైజ్ లు ఉన్నాయి.   ఈసర్వేలో అందరినీ వెనక్కి నెట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు మొదటిస్థానం దక్కించుకున్నాడు. గతసంవత్సరం సర్వేలో మహేష్ బాబు 2వ స్థానం ఉండగా, మొదటి స్థానంలో రానా వచ్చాడు. అయితే రానాను వెనక్కి నెట్టి మహేష్ బాబు నెం.1 పొజిషన్ దక్కించుకోగా రానా కేవలం 5వ స్థానానికి మాత్రమే పరిమితం అయిపోయాడు. 

అదేవిధంగా ‘బాహుబలి’ తో నేషనల్ స్టార్ గా మారిన ప్రభాస్ తన గత సంవత్సరం 3వ స్థానం నుండి పడిపోయి 4వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. అయితే అందరికీ షాక్ ఇస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోయినా జూనియర్ 2వ స్థానంలోను అల్లుఅర్జున్ 3వ స్థానంలోను ఈసారి టైమ్స్ సర్వేలో స్థానాలు పొందటం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇది ఇలా ఉండగా టైమ్స్ ప్రకటించిన  మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో నాగార్జునతో పాటు అతడి కొడుకులు నాగ చైతన్య అఖిల్ కూడ స్థానాలు సంపాదించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

అయితే టాలీవుడ్ ఎంపరర్ గా కోట్లాది మంది అభిమానులను పొందిన పవన్ కళ్యాణ్ కు ఈ టైమ్స్ ర్యాంకింగ్ లిస్టులో 7వ స్థానం మాత్రమే రావడం పవన్ అభిమానులకు షాక్ ఇచ్చే విషయం. అందరికీ షాక్ ఇస్తూ ఈ టైమ్స్ లిస్టులో రాజ్ తరుణ్ – నాని – శర్వానంద్ – హర్ష వర్ధన రాణే లు స్థానం సంపాదించడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. హీరో నుంచి విలన్ గా మారిన జగపతి బాబు తన స్థానాన్ని ఈ టైమ్స్ లిస్టులో ఏ మాత్రం పడిపోకుండా కొనసాగిస్తూ ఉండటం జగపతి బాబు వాహను నిరూపిస్తోంది. 

టైమ్స్ డిజైరబుల్ మెన్ ర్యాంకింగ్స్ లో ప్రధమ  స్థానం పొందిన మహేష్ ఈ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అందం పై ఆ శక్తికర వ్యాఖ్యలు చేసాడు. ఈ సంవత్సరంలో 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తన గ్లామర్ రహస్యాన్ని బయట పెడుతూ తనకు 40 సంవత్సరాలు వచ్చినా మనసులో మాత్రం తాను 25 సంవత్సరాల యువకుడునే అని అనుకుంటూ ఆనందంగా ఉంటానని అందువల్లనే తాను ఇప్పటికీ ఎప్పటికీ అందంగా ఉండగలుగుతున్నాను అంటూ కామెంట్స్ చేసాడు మహేష్. ఏమైనా మహేష్ మరోసారి తన టాలీవుడ్ ప్రిన్స్ స్థానాన్ని ఈ టైమ్స్ ర్యాంకింగ్ తో సుస్థిరo చేసుకున్నాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: