యంగ్ హీరోలు క్రేజీ  హీరోయిన్స్ తో నటించి వారి ద్వారా హిట్స్ కొడదామని చేస్తున్న ప్రయత్నాలు టాప్ హీరోయిన్స్ కు వరంగామారి వారి ఇంట కోట్లను కురిపిస్తోంది. ఇటువంటి సందర్భమే ఇప్పుడు రకుల్ ప్రీత్ కు అదృష్టంగా మారింది. రకుల్ ఇప్పటి వరకు టాప్ హీరోలందరితోను నటించినా ఆమె పారితోషికం ఇంకా కోటి రూపాయలు దాటలేదు. 

ఆమె నటించిన సినిమాలు ఇంకా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు అన్న నెపంతో మిగతా టాప్ హీరోయిన్స్ తో పోలిస్తే రకుల్ కు తక్కువగానే ముట్ట చెపుతున్నారని టాక్. అయితే ఈ పరిస్థుతులలో ఆమెకు యంగ్ హీరో బెల్లం కొండ శ్రీను అనుకోని అదృష్టంగా మారాడు. 

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం బెల్లం కొండ సురేష్  ఎప్పటి నుంచో బోయపాటి శ్రీను దర్శకత్వంలో తీద్దాం అని అనుకుంటున్నా సినిమాకు కోండ్ డౌన్ మొదలు కావడమే కాకుండా ఆ సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ ఎంపిక అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సినిమా హీరోయిన్ గా నటించడానికి రకుల్ ప్రీత్ కు 1.50 కోట్లు పారితోషికాన్ని ఇస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

మరో ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న బోయపాటి శ్రీనుకు ఏకంగా 12 కోట్లు భారీ పారితోషికం బెల్లం సురేష్ ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అనేక ఆర్ధిక సంస్థలలో ఉన్న బెల్లంకొండ సురేష్ ఇంత భారీ పారితోషికాలతో అసలు నిజంగా సినిమాను మొదలు పెట్టి పూర్తి చేసి ఆ సినిమాను మార్కెట్ చేయ గలడా అన్న కామెంట్స్ ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి. దీనితో హీరోయిన్ కు ఒకటిన్నర హీరోకి జీరో అంటూ ఇంకా ప్రారంభం కాని ఈ సినిమా పై సెటైర్లు పడుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: