మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మెగా హీరో సాయిధరమ్ తేజ్. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చిన మెగా హీరోలలో ఒక్క సాయిధరమ్ తేజ్ మాత్రమే ఫుల్ ఎనర్జిటిక్ గా ఉన్నాడని అంటున్నారు. ఇతర మెగా హీరోలు అంతా సాయిధరమ్ తేజ్ కంటే కొంత వెనకబడి ఉన్నట్టే అని అంటున్నారు. ఎందుకంటే మూవీలను వేగవంతంగా పూర్తి చేసుకోవటంతో పాటు, రిలీజ్ చేసుకోవటంలోనూ సాయిధరమ్ తేజ్ ప్లానింగ్ చాలా బాగుంటుందని అంటున్నారు.


ఒక మూవీ సెట్స్ మీద ఉండగానే మరో రెండు మూవీలకి సంబంధించిన పనులు సెట్స్ కి రెడీ చేసుకుంటున్నాడు. ఈ విధంగా సాయిధరమ్ తేజ్ మంచి ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నుడ. అయితే మెగాఫ్యామిలీలోని హీరోలకు కథ ఓకే కావాలంటే దాదాపు ఓ ప్రొటోకాల్ వంటి తతంగం ఉంటుంది. అవన్నీ పూర్తయ్యే వరకూ దాదాపు 2 నెలల సమయం పడుతుంది.


కానీ సాయిధరమ్ తేజ్ వ్యవహారం లో మాత్రం తన కథకి సంబంధించిన నిర్ణయాన్ని తనే ఫైనలైజ్ చేసుకుంటాడంట. కేవలం సలహాల కోసం మాత్రమే చిరంజీవి,అల్లుఅరవింద్ వంటి వారి వద్దకి కథలని పంపిస్తాడని అంటున్నారు. అందుకే అందరి మెగాహీరోల కథల కంటే సాయిధరమ్ తేజ్ కథలు చాలా స్పీడుగా సెట్స్ మీదకు వస్తున్నాయి. ఈ విధంగా సాయిధరమ్ తేజ్ భవిష్యత్ లోనూ కంటిన్యూ చేస్తే కొంత దెబ్బ పడే ఛాన్స్ ఉందని అంటున్నారు.


ఎందుకంటే ఇప్పటి వరకూ ఏ మెగాహీరో సినిమా కథ ఓకే కావాలన్నా కచ్ఛితంగా చిరంజీవి క్లీన్ రిపోర్ట్ వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రాసెస్ సాయిధరమ్ తేజ్ విషయంలో జరగటం లేదు. అందుకే మెగా ప్రొటోకాల్ ని సాయిధరమ్ తేజ్ లెక్క చేయటం లేదంటూ ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: