సాయి ధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ మే 5న విడుదల కాబోతోంది. ఈసినిమా పై ఉన్న భారీ అంచనాలతో నిర్మాత దిల్ రాజ్ ఏకంగా హీరో సూర్య నటించిన ‘24’ సినిమాతో పోటీగా విడుదల చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా టీజర్ కు పాటలకు వచ్చిన స్పందనతో ఈసినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈనేపధ్యంలో సాయిధరమ్ తేజ్ వీరాభిమానులు కొందరు వెబ్ మీడియాలో ఒక వింత ప్రచారం ప్రారంభించారు.

ఈసినిమాలోని సాయి ధరమ్ తేజ్ ఫోటోలను వెబ్ మీడియాలో షేర్ చేస్తూ తమ అభిమాని హీరో కు మాస్ మహారాజ రవితేజాకు ఉన్నంత ఎనర్జీ ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈకామెంట్స్ చూసి షాక్ అయిన సాయి ధరమ్ తేజ్ వెంటనే రంగంలోకి దిగి తన అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేస్తూ రవితేజా ఎనర్జీ లెవెల్స్ ముందు తాను సరిపోను అంటూ వినమ్రతగా కామెంట్స్ పెట్టాడు.

అయితే ఈకామెంట్స్ రవితేజా దృష్టికి రావడంతో సాయి ధరమ్ తేజ్ వీరాభిమానుల కామెంట్స్ కు ఆశ్చర్య పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మంచి డాన్సర్ గా నిరూపించుకున్న సాయి ధరమ్ తేజ్ మాస్ హీరోకు కావలసిన లక్షణాలు అన్నీ ఉండటంతో వరసగా సక్సస్ లు సాధిస్తూ తన ఇమేజ్ ను పెంచుకుంటూ ఏకంగా మెగా కాపొండ్ కే షాక్ లు మీద షాక్ లు స్తున్నాడు. 

ఈసారి సమ్మర్ రేస్ కు భారీ సినిమాల మధ్య పోటీ పడుతూ ధైర్యంగా వస్తున్న ‘సుప్రీమ్’ హిట్ టాక్ తెచ్చుకుని 25 కోట్ల కలక్షన్స్ ను రాబట్ట గలిగితే ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ టాప్ యంగ్ హీరోలతో పోటీ పడే స్థాయికి చేరుకుంటాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ పవన్ వరుణ్ తేజ్ ల సినిమాలు పరాజయాలు చెందిన నేపధ్యంలో అనుకోని హిట్ ను సాయి ధరమ్ సాధిస్తే అది నిజంగా మెగా కాంపౌండ్ కు తట్టుకోలేని షాక్ అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: