ఈరోజు అందర్నీ ఆశ్చర్య పరుస్తూ అతి నిరాడంబరంగా పవన్ కళ్యాణ్ ఎస్. జె. సూర్యల సినిమా మొదలైంది అన్న వార్తలు వస్తున్నాయి. శరత్ మరార్ కొత్త ఆఫీస్ లో ఎలాంటి సందడి లేకుండా ఈసినిమా పూజా కార్యక్రమాలు అతి నిరాడంబరంగా జరిగాయి. ఈకార్యక్రమానికి అతిధులుగా ఎవర్ని ఆహ్వానించ లేదు. కనీసం మీడియాకు కూడ వర్తమానం పంపకుండా ఈకార్యక్రమాన్ని సిoపుల్ గా నిర్వహించి అందరికీ షాక్ ఇచ్చాడు పవన్.

పవన్ కళ్యాణ్ దర్శకుడు ఎస్. జె. సూర్యా శరత్ మరార్ ఎడిటర్ గౌతమ్ రాజ్ లు మాత్రమే ఈకార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. అయితే అందర్నీ ఆశ్చర్య పరుస్తూ పవన్ కళ్యాణ్ కు దేవుడు ఇచ్చిన తమ్ముడు నితిన్ తండ్రి సుధాకర రెడ్డి ఈసినిమాకు క్లాప్ కొట్టడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

నిన్న మొన్నటి దాకా ఈసినిమాకు శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తాడు అని వార్తలు వచ్చిన నేపధ్యంలో నితిన్ తండ్రి సుధాకర రెడ్డికి పవన్ కొత్త సినిమాకు గల సంబందం ఏమిటి అన్న విషయమై ఫిలింనగర్ లో లోతుగా చర్చలు జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో నితిన్ కు పవన్ తో సినిమా తీయాలి అనే కోరిక ఉన్న నేపద్యంలో ఈ సినిమాకు శరత్ మరార్ తో పాటు నితిన్ తండ్రి కూడ నిర్మాతగా వ్యవహరిస్తున్నడా అన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి.

ఈవార్తలు ఇలాఉండగా ఈసినిమాలో హీరోయిన్ గా పవన్ పక్కన నటించేందుకు ఒకకొత్త అమ్మాయికి అవకాశం ఇస్తున్నట్లు టాక్. ఈసినిమా దర్శకుడు ఎస్.జె. సూర్యా  ఈమధ్యనే ముంబాయి వెళ్ళి కొంతమంది కొత్త అమ్మాయిలతో ఇంటర్వ్యూలు చేయడమే కాకుండా కొన్ని ఫోటో సెషన్స్ కూడ నిర్వహించినట్లు తెలుస్తోంది. మే నెల నుండి నిర్విరామంగా ఈ షూటింగ్ నిర్వహించి వీలైనంత తక్కువ బడ్జెట్ లో ఈ సినిమాను పూర్తి చేయాలి అన్న పట్టుదలలో పవన్ ఉన్నట్లు టాక్. ‘సర్దార్’ ఇచ్చిన పరాభవం తరువాత నిర్మించ బడుతున్న ఈ సినిమా పై ఎటువంటి భారీ అంచనాలు పెంచకుండా వ్యహత్మకంగా అడుగులు వేయాలని పవన్ ఎత్తుగడ అన్న మాటలు వినిపిస్తున్నాయి. పవన్ మధ్యలో తన మూడ్ మార్చుకోకుండా ఈ సినిమాను ఎంత తొందరగా పూర్తి చేయగలడో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: