మెగా ప్రిన్స్ గా మెగా అభిమానుల చేత అభిమానంగా పిలిపించుకునే వరుణ్ తేజ్ ‘ముకుంద’, ‘కంచె’, ‘లోఫర్’ లాంటి మూడు సినిమాలలో వరసగా నటించినా నటుడుగా పేరు వచ్చింది కాని ఒక్క కమర్షియల్ హిట్ కూడ పడలేదు. దీనితో వరుణ్ తేజ్ తీవ్ర గందరగోళంలో పడిపోవడమే కాకుండా ఏ సినిమాలను ఎంచు కోవాలి అన్న అయోమయంలో పడిపోయాడు. 

క్రిష్‌తో అనుకున్న 'రాయబారి' పట్టాలెక్కలేదు. గోపీచంద్ మలినేనితో ప్రారంభం అవుతుంది అనుకున్న సినిమా మొదలు కాలేదు. దీనితో అనేక ఆలోచనలు చేసే చిట్టచివరకు శ్రీను వైట్లతో ‘మిస్టర్’ గా రాబోతున్నాడు. ఈ  సినిమా ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం జరిగింది. అయితే సామాన్యంగా మెగా యoగ్ హీరోల సినిమా ఫంక్షన్స్ కు చిరంజీవి కాని రామ్ చరణ్ కాని వస్తూ ఉంటారు. 

అయితే ఈ సాంప్రదాయాన్ని తప్పించి ఈసినిమా ప్రారంభోత్సవం ఈరోజు రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటలకు జరిగింది. ఈ కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ వచ్చి క్లాప్ ఇవ్వడంతో ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులు అంతా వరుణ్ తేజ్ మెగా కుటుంబ సాంప్రదాయాన్ని మార్చేశాడు అని కామెంట్ చేసుకున్నట్లు టాక్. 

‘ఆగడు’, ‘బ్రూస్ లీ’ సినిమాల ఘోర పరాజయం తరువాత శ్రీను వైట్ల వరుణ్ తేజ్ తో తీస్తున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ కామెడీగా శ్రీను వైట్ల మార్క్ తో తీస్తున్నట్లు టాక్. ప్రస్తుతం మంచి క్రేజ్ మీద ఉన్న లావణ్యా త్రిపాఠీ హెబ్బా పటేల్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈసినిమా సక్సస్ శ్రీను వైట్లకు అదేవిధంగా వరుణ్ తేజ్ కు అత్యంత కీలకం. అయితే ప్రస్తుతం లావణ్యా త్రిపాఠీ హెబ్బా పటేల్ ల హవా నడుస్తోంది కాబట్టి వీరి అదృష్టం ఎంత వరకు వరుణ్ తేజ్ ను కాపాడుతుందో చూడాలి... 



మరింత సమాచారం తెలుసుకోండి: