మెగా హీరోల్లో అతి తక్కువ టైంలోనే అభిమానుల చెంత చేరిన కుర్ర హీరో సాయి ధరం తేజ్.. చేసిన నాలుగు సినిమాలతోనే మాస్ ఇమేజ్ సంపాదించిన ఈ మెగా హీరోని రవితేజతో పోల్చుతున్నారట. అయితే తాను అప్పుడే ఆ రేంజ్ కు వెళ్లలేదని.. తనకు అంత మాస్ ఫాలోయింగ్ కూడా రాలేదంటూ కటింగ్స్ ఇస్తున్నాడు సాయి ధరం తేజ్.


ప్రస్తుతం సుప్రీం అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సాయి సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్ బాగానే సేల్ అయినా కథల విషయంలో మరింత జాగ్రత్త పడుతున్నాడు మెగా హీరో.. ఇక పటాస్ అంటూ తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సుప్రీం సూపర్ హిట్ అనే నమ్మకంతో ఉన్నాడు మెగా హీరో.


సుప్రీమ్ సినిమాలో షూటింగ్లో సాయి ధరం తేజ్ :


రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తిక్ మ్యూజిక్ అందించాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్ శ్రోతలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొన్నటిదాకా మే 6న రిలీజ్ అంటూ హడావిడి చేసిన దిల్ రాజు సినిమాను ఓ రోజు ముందే అంటే మే 5న రిలీజ్ చేస్తుండటం విశేషం. ఓ పక్క సూర్య త్రిపాత్రాభినయంతో చేస్తున్న 24 మే 6న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.


అయితే తమ సినిమాకు 24 ఎలాంటి పోటీ కాదు.. ఎవరి మార్కెట్ వారిది అన్న పంథాలో సినిమాను ధైర్యంగా రిలీజ్ చేస్తున్నాడు దిల్ రాజు. మరి రాజు గారి నమ్మకం ఈ సినిమా ఎలా నిలబెడుతుందో చూడాలి. ఇప్పటికే బిజినెస్ లో టేబుల్ ప్రాఫిట్స్ వచ్చిన సుప్రీం రిజల్ట్ సాయి ధరం తేజ్ కెరియర్ కు చాలా హెల్ప్ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: