నిన్న సాయంత్రం పూరి జగన్నాథ్ ఎవరూ ఊహించని ఒక షాక్ అందరికీ ఇచ్చాడు. నిన్నటితో మహేష్ పూరీల కాంబినేషన్ లో వచ్చిన ‘పోకిరి’ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో మహేష్ అభిమానులకు అంతటి ఘన విజయాన్ని ఇచ్చినందుకు తన కృతజ్ఞతలు తెలియ చేస్తూ మహేష్ అభిమానులకు ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టి మైండ్ బ్లాంక్ చేసాడు. 

ఎప్పటి నుంచో పూరి జగన్నాథ్ మహేష్ ల కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆ వార్తలను నిజం చేస్తూ పూరి ఏకంగా పవన్ తో తాను మొదలు పెట్ట బోతున్న సినిమా టైటిల్ ను ప్రకటించడమే కాకుండా ఆసినిమాకు ‘జన గణ మన’ అన్న టైటిల్ ఫిక్స్ చేసి ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడ విడుదల చేసి అందర్నీ ఆశ్చర్య పరిచాడు పూరి.

ఈ టైటిల్ ను బట్టి ఒక సామాజిక స్ప్రహతో కూడిన ఒక పవర్ ఫుల్ స్టోరీని పూరి మహేష్ కోసం రెడీ చేసినట్లుగా అనిపిస్తోంది. జాతీయ జెండాను గుర్తుకు చేసే విధంగా మహేష్ ముఖాన్ని మూడు రంగులతో కవర్ చేస్తూ ఇది ఒక దేశభక్తి సినిమాగా ఉండబోతోంది అన్న లీకులు ఇస్తున్నాడు పూరి. ఈ షాకింగ్ న్యూస్ మహేష్ వరకు చేరడంతో తాను ఈ సినిమాలో నటించడానికి ఎదురు చూస్తున్నాను అంటూ తన ట్విటర్ లో మెసేజ్ పెట్టడంతో వచ్చే సంవత్సరం మహేష్ పూరీల ‘జనగణమన’ కు కౌంట్ డౌన్ మొదలైంది అనుకోవాలి.

అయితే కొద్ది కాలం క్రితం పవన్ కళ్యాణ్ తో ఈ ‘జన గణ మన’  టైటిల్ తో నిర్మాత దిల్ రాజ్ సినిమాను నిర్మించడానికి ప్రయత్నించాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రయత్నాలు ముందుకు సాగలేదు. కానీ అదే టైటిల్ ను ఇప్పుడు పూరి మహేష్ కు ఉపయోగిస్తూ ఏకంగా ఈసినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడ విడుదల చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: