యంగ్ హీరోయిన్  రెజీనా కసాండ్రా నందమూరి తారకరత్నను ఒక ఛానెల్  ఇంటర్వ్యూలో ‘అన్నా’ అని సంభోదించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత తరం యంగ్ హీరోయిన్లలో మంచి పేరు తెచ్చుకున్న రెజీనా పెర్ఫామెన్స్ రోల్స్ లోనే కాకుండా గ్లామర్ కేరక్టర్లు  కూడ నటిస్తూ టాలీవుడ్ లో సెటిల్ కావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. 

అయితే ఈమె సడన్ గా విలన్ పాత్రధారి నందమూరి తారకరత్నను  ఒక ఛానల్ కోసం ఇంటర్వ్యూ చేస్తూ కొత్త రోల్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘జ్యో అచ్యుతానంద’ లో నారా రోహిత్ తో నటిస్తున్న  రెజీనాను ‘రాజా చెయ్యి వేస్తే’ చిత్ర ప్రమోషన్ కోసం చాలా వ్యూహాత్మకంగా రోహిత్ ఉపయోగిస్తున్నాడు. ‘రాజా చెయ్యి వేస్తే’ మూవీలో విలన్ గా నటించిన తారకరత్నను రెజీనా ఇంటర్వ్యూ చేసింది. 9 ఏళ్ల వయసులోనే టీవీల్లో యాంకరింగ్ చేసిన అనుభవం రెజీనాకు ఉండటంతో ఈమె ఇంటర్వ్యూ ను చాలా ఈజీగా చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

ఈ సినిమా గురించి  ఈ సినిమాలోని  డైలాగ్స్ గురించి, సాంగ్స్ గురించి కేరక్టర్స్ గురించి, ఇలాఎన్నో  ప్రశ్నలు తారకరత్నను అడిగింది. అంతేకాదు తారక రత్న కెరియర్ గురించి కూడ ఎన్నో విషయాలు అడిగింది రెజినా. ఈ ప్రశ్నలకు  తారకరత్న కూడా ఎంతో ఓపిగ్గా వివరంగా ఆన్సర్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే ‘తారకరత్న అన్న మనతో ఉన్నారు’ అంటూ షాక్ ఇచ్చిన  రెజీనా చివర్లో తారక్ అన్నా అంటూ  మరింత పర్సనల్ గా మాట్లాడటం ఈ కార్య క్రమాన్ని చూసేవారికి షాక్ ఇచ్చింది.

అయితే రెజీనా పిలుపుతో తారకరత్న షాక్ అయినా తన మనసులో భావాలు బయట పడకుండా ఈ ఇంటర్వ్యూని చక్కగా ముగించాడు. ఈ మధ్య కాలంలో విలన్స్ గా మారుతున్న హీరోల సంఖ్య బాగా పెరుగుతూ ఉండటంతో అదే సెంటిమెంట్ తో కూడిన లక్ తనకు బాగా కలిసి వస్తుందని గంపెడు ఆశలపై  ఉన్నాడు తారక రత్న..


మరింత సమాచారం తెలుసుకోండి: