త్రివిక్రం దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటిస్తున సినిమా అఆ.. రాధాకృష్ణ చినబాబు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమా ఎన్నో రోజుల నుండి పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అయితే ఇక ఒకరితో మనకు సంబంధం లేదు అన్నట్టు మే 27న రిలీజ్ కన్ఫాం చేశాడు త్రివిక్రం. ఇక మే 2న ఆడియో కూడా జరుపుకోనుంది. అయితే ఈ ఆడియోకి నితిన్ ఫేవరేట్ హీరో.. త్రివిక్రంకు ఆత్మీయుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతుండటం విశేషం. 


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అభిమానులే కాదు హీరోలు కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ గా ఉంటారు.. అందులో నితిన్ ముందుంటాడు. ఇక తనకు ఎంతగానే ఆప్తుడైన త్రివిక్రం దర్శకత్వం చేస్తున్న అ ఆ సినిమా కోసం పవన్ రాక తప్పట్లేదు.  


అఆ ఆడియో రిలీజ్ పోస్టర్ :


అన్నయ్య 150వ సినిమా మెగా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయినా పవన్ మాత్రం అటు వెళ్లలేదు. ఇన్వైట్ చేసినా వెళ్లలేదు.. అయితే త్రివిక్రం, నితిన్ లు తమ సినిమా ఆడియోకి గెస్ట్ గా రావాల్సిందే అని అడుగగానే ఓకే అనేశాడట. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన ట్విట్టర్ లో తెలియచేశాడు. అఆ పక్క పక్కనే ఉన్న రెండు అక్షరాలు కలవడానికి పాతికేళ్ల సమయం పట్టింది అంటూ తన పెన్ పవర్ ను టీజర్ లో చూపించిన త్రివిక్రం ఈ సినిమాతో మరోసారి తన టాలెంట్ చూపించాలనుకుంటున్నాడు. 


ఇక నితిన్ మరోసారి ట్రాక్ తప్పాడు. కాబట్టి అఆ సినిమా హిట్ అయ్యి మళ్లీ ట్రాక్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న అఆ మూవీ అన్ని కార్యక్రమాలు ముగించుకుని మే 27న రిలీజ్ అవనుంది. మిక్కి జే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మలయాళ ప్రేమం బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఓ ప్రముఖ పాత్రలో నటిస్తుండటం విశేషం.    


మరింత సమాచారం తెలుసుకోండి: