హీరోయిన్ పూనమ్ బజ్వా ఈ మధ్య సినిమాలలో కనిపించక పోతున్నా ఆమె గురించి కొత్త న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈమె టాలీవుడ్ కి చెందిన ఓ డైరెక్టర్ ని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకుందంటూ ఫిలింనగర్ లో రూమర్లు హడావిడి చేస్తున్నాయి. పదేళ్ల కిందట టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈబ్యూటీ చాలా తక్కువ సినిమాలు చేసింది.
ఈమె సినిమాలలో నాగార్జునతో చేసిన 'బాస్', అల్లు అర్జున్' తో 'పరుగు' బాగా గుర్తిపు పొందాయి. అయితే ఈ మధ్య ఈమె సినిమాలు ఏమి విడుదల కాలేదు. ఇది ఇలా ఉండగా మూడురోజుల కిందట సీక్రెట్ గా పూనమ్ బజ్వా పెళ్లి జరిగినట్లు మీడియాలో వార్తలు హడావిడి చేస్తున్న్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినా ఇప్పడు ఈ న్యూస్ హాట్ న్యూస్ గా మారింది.
ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈమె టాలీవుడ్ దర్శకుడు సునీల్ రెడ్డిని ఆమె వివాహం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరు కొంతకాలంగా డేటింగ్లో వున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పడు సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఏమిటన్న విషయం పై ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి.
ఈ దర్శకుడు గతంలో త కళ్యాణ్ రామ్ తో 'ఓం 3డి' అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం సునీల్ రెడ్డి సాయి ధరమ్ తేజ్ తో 'తిక్క' అనే సినిమా చేస్తున్నాడు. అయితే వీరిద్దరూ ఇంత సింపుల్ గా రహస్యంగా రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవడం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. వీరి వివాహానికి ఎవరైనా అడ్డు పడ్డారా ? లేక మరేమైనా కారణం ఉందా ? అన్న విషయమై రకరకాల కధనాలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఈ విషయం రానున్న రోజులలో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు తీసుకుంటుందో చూడాలి..