మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ మంచి మాటకారి కూడాను.. అదేంటి అలా అనేశారంటారా.. తన ప్రతి సినిమాలో మెగాస్టార్ సాంగ్ రీమిక్స్ చేస్తూ మెగా అభిమానుల ఆశీస్సులు పొందుతున్న సాయి ధరం తేజ్ మామయ్య పాటలు ఇష్టం లేకుండానే వాడేస్తున్నానని అంటున్నాడు. ఈ మాట కాస్త అభిమానుల్లో ఆగ్రహం తెప్పించేలా ఉన్నా అది నిజమే అంటున్నాడు సాయి.


తనతో చేసే ప్రతి దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి సాంగ్ రీమిక్స్ తో కథ చెప్పడం జరుగుతుందని.. వారి బలవంతం వల్లనే అలా రీమిక్స్ చేయాల్సి వస్తుందని అంటున్నాడు. అయితే వారు ఎంత బలవంత పెట్టినా మెగా మేనళ్లుడిగా తన ప్రమేయం లేకుండా ఆ సాంగ్స్ ఎలా ఓకే అవుతాయని అంటున్నారు అభిమానులు. మొదట్లో కూడా మెగా ఇమేజ్ వద్దు వద్దు అంటూనే మెగాస్టార్ మేనరిజాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సాయి ఇలా మాట్లాడటం కాస్త ఆశ్చర్యంగానే ఉంది.


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లానే తాను కూడా రిలీజ్ ముందు ఓ నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన సాయి ధరం తేజ్ వారి అడిగిన ప్రశ్నలకు పై విధంగా స్పందించడం జరిగింది. మరి ఇష్టం లేకుండానే వాడేస్తున్న మామయ్య ఇమేజ్ తో కాకుండా సొంత స్టైల్ తో ఓ ఐడెంటిటీ సంపాదిస్తే బెటర్ లేదంటే సాయి కెరియర్లో వెనుకపడాల్సి వస్తుంది.


ప్రస్తుతం చేస్తున్న సుప్రీం సినిమాతో మే 5న రాబోతున్న సాయి ధరం తేజ్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ప్రీ బిజినెస్ లో అదరగొడుతున్న ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: