డివైడ్ టాక్ తో మొదలై ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా సెటిల్ అయిన ‘సరైనోడు’ సక్సెస్స్ ను ఎంజాయ్ చేస్తున్న అల్లుఅర్జున్ కు బోయపాటి శ్రీనివాస్ సమస్య తల నొప్పిగా మారింది అని టాక్.  ‘సరైనోడు విడుదల అయి 10 రోజులు దాటిపోయినా అల్లు కాంపౌండ్ కేవలం అల్లుఅర్జున్ ను మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ ఇప్పటికీ తన ప్రచారాన్ని కొనసాగిస్తోందని కనీసం తన పేరును కూడ మీడియా ముందు అల్లు అర్జున్ సరిగ్గా చెప్పక పోవడంతో తనకు చాలా బాధ కలిగిస్తోందని బోయపాటి ఈమధ్య అల్లుఅరవింద్ దగ్గర గగ్గోలు పెట్ట్టినట్లు టాక్.

‘లెజెండ్’ సూపర్ సక్సెస్స్ తరువాత ఆ సినిమా ప్రమోషన్ లో బాలకృష్ణ తనకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన విషయాన్ని బోయపాటి అల్లుఅరవింద్ కు గుర్తు చేస్తూ తాను అటువంటి గౌరవాన్ని అల్లు కాంపౌండ్ నుంచి కోరుకుంటున్నాను అంటూ స్పష్టంగా చెప్పి బోయపాటి అల్లుఅరవింద్ కు షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు అల్లుఅర్జున్ వరకు చేరడంతో బన్నీ నష్ట నివారణ చర్యలు చేపట్టాడు అని తెలుస్తోంది. 

త్వరలో నిర్వహించబోతున్న ‘సరైనోడు’ సక్సస్ టూర్ లో బోయపాటికి సరైన ప్రాధాన్యత కల్పిస్తాము అని బన్నీ బోయపాటికి స్వయంగా చెప్పినట్లు టాక్. అంతేకాదు  వచ్చే సంవత్సరం బోయపాటి దర్శకత్వంలో మరో సినిమాను చేస్తాను అని బన్నీ ప్రామిస్ ఇవ్వడమే కాకుండా రామ్ చరణ్ బోయపాటిల కాంబినేషన్ లో ఒక సినిమా వచ్చేలా తన వంతు సహకారాన్ని బోయపాటికి అందిస్తానని చెప్పి బన్నీ బోయపాటిని కూల్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమాకు మొదటి వారం 40 కోట్ల కలక్షన్స్ వచ్చిన వార్తలలో పూర్తి నిజం లేదని ఈ సినిమాకు హైక్ క్రియేట్ చేయడానికి అల్లు కాంపౌండ్ చాల వ్యూహాత్మకంగా ఈ వార్తలను మీడియాలో ప్రచారంలోకి తీసుకు వచ్చిందని కొందరు బన్నీ వ్యతిరేకులు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అమెరికాలో అదేవిధంగా కర్ణాటకాలో చాల తక్కువ కలక్షన్స్ వచ్చిన ఈసినిమాకు కేవలం మన తెలుగు రాష్ట్రాలలో 40 కోట్లు ఎక్కడ నుంచి వస్తాయని కొందరు విశ్లేషకులు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: