ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ‘బ్రహ్మోత్సవం’.‘బ్రహ్మోత్సవం’ మూవీకి సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ యాక్టివిటీస్ ని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ‘బ్రహ్మోత్సవం’ మూవీపై భారీ ప్రమోషన్ యాక్టివిటీస్ ని ప్లాన్ చేసినట్టుగా చిత్రయూనిట్ నుండి అందుతున్న సమాచారం.


ఇక ‘బ్రహ్మోత్సవం’సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, మే 7న హైదరాబాద్‌లో జరుగుతున్న ఆడియో విడుదలకు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు.‘బ్రహ్మోత్సవం’ ఆడియో ఫంక్షన్ పై చిత్ర నిర్మాత పివిపి సైతం భారీ ప్రమోషన్స్ ని చేపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో భారీ ప్రమోషన్ తో వచ్చిన సినిమాలు అన్నీ రిలీజ్ రోజున నెగిటివ్ టాక్స్ ని సొంతం చేసుకున్నాయి.


అందుకే ‘బ్రహ్మోత్సవం’మూవీపై భారీ ప్రమోషన్స్ చేపట్టకుడదని ప్రిన్స్ భావిస్తున్నాడంట. ‘బ్రహ్మోత్సవం’మూవీకి సంబంధించిన ప్రమోషన్ విషయంలో శ్రీకాంత్ అడ్డాల కొత్త పద్దతులను అవలంభిస్తున్నాడు. ప్రమోషన్ ప్లానింగ్ ని దర్శకుడే స్వయంగా ప్లాన్ చేశాడంట. దీంతో శ్రీకాంత్ రెడీ చేస్తున్న ఓవర్ పబ్లిసిటీ ప్లాన్ కి హీరో మహేష్ బాబు చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన చర్ఛలు ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.


ఇక ఆడియో ఫంక్షన్ వివరాలను చూస్తే, ‘బ్రహ్మోత్సవం’ ఆడియో వేడుకకు జె.ఆర్.సీ కన్వెన్షన్ సెంటర్‌ ని ప్లాన్ చేసినట్టు తెలస్తుంది. మహేష్,దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలల సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో‘బ్రహ్మోత్సవం’పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను 7న విడుదల చేయనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: