ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి జోరు మీద ఉన్న హీరో రాజ్ తరుణ్. మంచు విష్ణుతో నటించిన ఆడోరకం ఈడోరకం మూవీ రాజ్ తరుణ్ కి మంచి సక్సెస్ ని ఇచ్చింది. మంచు విష్ణు వంటి స్టార్ హీరోతో నటించటం రాజ్ తరుణ్ కి ప్లస్ గా మారింది. ఈ మూవీ బాక్సాపీస్ వద్ద సైతం మంచి కలెక్షన్స్ తో ఆడటంతో, దీనికి సీక్వెల్ ని ప్లాన్ చేయాలని చూస్తున్నారు.


సీక్వెల్ అంటే ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్లో హైప్ పెరిగిపోవటం, తరవాత అది బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ కావటం జరుగుతుంది. దీంతో సీక్వెల్ కంటే మరో డిఫ్రెంట్ మూవీనే ప్లాన్ చేస్తే ఎలా ఉటుంది? అంటూ ఆలోచిస్తున్నారు. ఈ విధంగా చూస్తే మళ్ళీ ముంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్ లో ఓ మూవీ రాబోతుందని అంటున్నారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ సైతం కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు.


తను చేసిన సోలో సినిమాల కంటే ఇప్పడు  చేస్తున్న స్టార్ హీరో కాంబినేషన్ సినమాలు తన మార్కెట్ ని పెంచుతున్నాయని భావిస్తున్నాడు. ఈ విధంగా రాజ్ తరుణ్ కి లక్ తిరిగిందని అంటున్నారు. మరోవైపు నాని, రాజ్ తరుణ్ కాంబినేషన్ లోనూ డైరెక్టర్స్ కథలని రెడీ చేస్తున్నారు. ప్రస్తుతం నాని ఫుల్ ఫాంలో ఉన్నాడు. రాజ్ తరుణ్ కి సైతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.


వీరిద్దరూ కలిసి చేస్తే కచ్ఛితంగా మంచి కమర్షియల్ మూవీ అవుతుందని భావిస్తున్నారు. రాజ్ తరుణ్ సైతం స్టార్ హీరోల సరసన స్క్రీన్ స్పేస్ ని పంచుకునే అవకాశం వస్తే, నటించేందుకు రెడీ ఉన్నాడు. మొత్తంగా రాజ్ తరుణ్ కి ప్రస్తుతం అంతా మంచే  జరుగుతుందని ఇండస్ట్రీ అంటుంది. ఇక ఈ హీరో రెమ్యునరేషన్ విషయంలోనూ ఒక అడుగు ముందుకు వేసి, భారీ గా రేటుని పెంచాడని అంటున్నారు.   



మరింత సమాచారం తెలుసుకోండి: