యోగా బ్యూటీ అనుష్కకు గ్లామర్ తగ్గింది అంటూ ఒక వైపు ప్రచారం జరుగుతూ ఉంటే  తన హవా ఏమాత్రం తగ్గలేదు అని అనుష్క మరోసారి రుజువు చేసుకుంది. అభినయం పరంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క ఎంతమంది హీరోయిన్స్ వస్తున్నా తన స్థాయిని పెంచుకుంటూనే ఉంది. లేటెస్ట్ గా  హైదరాబాద్ టైమ్స్  2015 సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఎవరు అనే అంశం పై నిర్వహించిన సర్వేలో అనుష్క నెం.1 స్థానం దక్కించుకుంది. 

ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలోఎక్కువ మంది అనుష్కకే ఓటేసారు.  అయితే అనుష్క తర్వాతి స్థానంలో ఇప్పుడు ఎక్కడా సినిమాలలో  హీరోయిన్ గా కనిపించని శ్రియ తన 2వ స్థానాన్ని కొనసాగిస్తూనే ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా చక్రం తిప్పుతున్న తమన్నాకు 3వ స్థానం కాజల్ కు 4వ స్థానం సమంతకు 5వ స్థానం వచ్చింది. అయితే క్రితం సంవత్సరం 4వ స్థానంలో నిలిచిన శ్రుతిహాసన్ ఈ సంవత్సరం 6వ స్థానానికి పడిపోవడం మరొక షాకింగ్ ట్విస్ట్.

ఇక రకుల్ ప్రీత్ – హెబ్బా పటేల్ – రాశి ఖన్నాలు టాప్ 10 స్థానాలలో నిలబడటం మరొక ట్విస్ట్. అయితే మెగా హీరోయిన్ గా పేరు పొందిన రెజీనాకు సినిమాలలో అవకసాలుతగ్గినా ఈ ర్యాంకింగ్స్ లో మాత్రం గత సంవత్సరం ర్యాంక్ కన్నా ముందుకు జరిగి ఈ సంవత్సరం 14వ స్థానంలో నిలిచింది.

అందర్నీ ఆశ్చర్య పరుస్తూ హీరోయిన్ నందిత - దిషా పటాని - జ్వాలా గుత్తా ఈ ర్యాంకింగ్స్ లో స్థానం సంపాధించు కోవడం ఆశ్చర్య పరిచింది. అయితే కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ మన సీనియర్ హీరోలను తన కాంపౌండ్ చుట్టూ తిప్పు కుంటున్న నయన తార అదేవిధంగా కొత్తగా మెరుపులు మెరిపిస్తున్న లావణ్యా త్రిపాఠీ ఈ టాప్ 25 ర్యాంకింగ్స్ లో చోటు దక్కకపోవడం వారికి షాకింగ్. తన మానసిక సౌoదర్యం ముందు ఏ బ్యూటీ క్రీమ్ సాధనాలు పనికి రావు అని అనుష్క చెపుతున్న మాటలను బట్టి ఈమె హవా మరి కొన్ని సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: