స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు మరింత పండుగ చేసుకునే అవకాశం ఇచ్చాడు బన్ని. రీసెంట్ గా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడుతో తన స్టామినా ఏంటో మరోసారి రుచి చూపించాడు. ప్రస్తుతానికి తెలుగులోనే రిలీజ్ అయిన సరైనోడు ఇప్పటికే 70 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను సాదించాడు. ఇక ఇప్పుడు ఈ నెల 13న మలయాళంలో ఈ సినిమాను 'యోధవ్..ది వారియర్' గా రిలీజ్ చేస్తున్నారు.


సో అసలే మల్లూవుడ్ లో బన్నికి బీబత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అందులోనూ బన్ని ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ చేసిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. తెలుగులో ఎంత మార్కెట్ ఉందో అల్లు అర్జున్ కు కేరళలో కూడా అంతే మార్కెట్ పెంచుకున్నాడు. 


సరైనోడులో అల్లు అర్జున్ :


ఇక సరైనోడుగా వచ్చిన బన్ని ముందు డివైడ్ టాక్ వచ్చినా అవేవి కలక్షన్స్ మీద ప్రభావితం అయ్యేలా చేయలేదు. సమ్మర్ వార్ లో సరైనోడు కలక్షన్ల సునామి సృష్టిస్తున్నాడని చెప్పాలి. ముఖ్యంగా బోయపాటి మాస్ అస్త్రానికి బన్ని సరైనోడుగా ఉన్నాడు అందుకే బి,సి సెంటర్స్ లో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తుంది.


ఇన్నాళు సొంత బ్యానర్లో తాను సినిమా తీస్తే ఫ్లాప్స్ చవిచూసిన బన్ని ఈ సరైనోడుతో ఆ బ్యాడ్ నేం చెరిపేశాడు. కేవలం బన్ని స్టామినా మీదే నడుస్తున్న సరైనోడు సినిమా ఈ సమ్మర్లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి తీరాల్సిందే. మరి కేరళలో ఈ సరైనోడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: