త్రివిక్రం నుండి సినిమా అంటే పరిశ్రమ ఓ కన్నేసి ఉంచుతుంది ఎందుకంటే అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసిన ఆ సినిమా త్రివిక్రం దర్శకత్వంలో వచ్చిందే. అదే కాదు తాను తీసే ఏ సినిమా అయినా సరే మంచి హిట్ సాధిస్తుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. తీసిన 7 సినిమాల్లో ఒక్క ఖలేజా తప్ప అన్ని సినిమాలు సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రం జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో హిట్ అందుకున్నాడు. 


తాజాగా నితిన్ సమంత లీడ్ రోల్స్ లో అ ఆ సినిమాతో రాబోతున్నాడు. నిన్న రిలీజ్ అయిన ఈ ఆడియో వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ రావడం జరిగింది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసి మహేష్ షాక్ అవ్వక తప్పదు. త్రివిక్రం సినిమా ట్రైలర్ మహేష్ ఎందుకు షాక్ ఇస్తుంది అంటే.. దాదాపుగా ఒక వారం గ్యాప్ తో త్రివిక్రం అఆ, మహేష్ బ్రహ్మోత్సవం రిలీజ్ అవుతున్నాయి.   


త్రివిక్రం స్టైల్ ఆఫ్ మేకింగ్ తెలిసు.. మహేష్ కూడా త్రివిక్రం కు మంచి స్నేహితుడు అయితే సినిమాల విషయంలో అలా కాదు. ఎవరి సినిమా వారిదే.. అయితే మహేష్ ఈ నెల 20, 27ల్లో రాబోతున్నాడని కన్ఫాం చేశాడు. ఇక అ ఆ ను కూడా 27న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. సో త్రివిక్రం, మహేష్ ఇద్దరు పోటీ పడక తప్పేట్టు లేదు. 


బయట ఇద్దరు మంచి స్నేహితులే అయినా మహేష్, త్రివిక్రం వారం గ్యాప్ తో ఇలా బాక్సాఫీస్ పై యుద్ధానికి దిగటం కాస్త కొత్తగా ఉన్నా పరిశ్రమకు మంచిదే అని చెప్పాలి. ఇక మరో పక్క మహేష్ బ్రహ్మోత్సవం ఆడియోని 7వ తారీఖున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు కామన్ పాయింట్ ఏంటంటే రెండు సినిమాలకు మిక్కి జె మేయర్ సంగీతాన్ని అందించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: