దర్శకరత్న దాసరి నారాయణరావు ఒక భారీ హిట్ సినిమాను తీసి తాను పోగొట్టుకున్న క్రేజ్ ను ఏదోవిధంగా తిరిగి సాధించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకప్పుడు టాలీవుడ్ దర్శకులలో నెంబర్ వన్ పొజిషన్ లో టాలీవుడ్ టాప్ హీరోలను శాసించిన దాసరి మారిన ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా సినిమాలు తీయలేక  ఔట్ డేటెడ్ అయిపోయి తన ఫామ్ కోల్పోయిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాల కిందట ‘ఒసేయ్ రాములమ్మ’ తో హిట్టుకొట్టిన తరువాత దాసరి తీసిన ఏ సినిమా కూడ విజయ వంతం కాలేదు. 

చిట్టచివరగా ఈమధ్యన ‘ఎర్రబస్సు’ తో మంచు విష్ణుతో చేసిన ప్రయత్నం కూడ పీడకలలా మారింది. దీనితో దాసరి మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లరనే అనుకున్నారంతా. కానీ దర్శకరత్న దాసరి ఈమధ్య ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన డ్రీమ్ మూవీ ప్రాజెక్ట్ ను బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. మహాభారతం కథను తెరకెక్కించాలన్నది తన కల అని అంటూ దాన్ని ఐదు భాగాలుగా తీయబోతున్నానని దాసరి ప్రకటించడం విశేషం. మహాభారత చివరి భాగమే తన చివరి సినిమా అని ఆయన ప్రకటించారు.

అంతేకాదు మహాభారతం సినిమాకు సంబంధించి రెండు భాగాలకు స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని ప్రస్తుతం మూడో భాగానికి సంబంధించి పని నడుస్తోందని దాసరి మరో షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు. ఈ భారీ ప్రాజెక్ట్ కన్నా ముందు తాను అందరూ కొత్త వాళ్ళతో ఒక సినిమా తీస్తానని ఆ తరువాత వెంటనే పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుందని దాసరి మరో ట్విస్ట్ ఇచ్చారు. 

అయితే మహాభారత కథను 5 భాగాలుగ తియ్యాలి అంటే వందల కోట్ల బడ్జెట్ కావాలి ఈ పరిస్థుతులలో దాసరిని నమ్ముకుని అంత భారీ పెట్టుబడి పెట్టే నిర్మాత ఎక్కడ ఉన్నాడు అన్నదే ప్రశ్న. అయితే ఇప్పటికే రాజమౌళి తాను ఎప్పటికైనా మహాభారతాన్ని సినిమాగా తీస్తాను అని చెపుతున్న నేపధ్యంలో ఇప్పుడు దాసరి కూడ అదే కల కంటూ ఉండటంతో వీరిద్దరిలో ‘మహాభారతం’ తీయగల అదృష్ట వంతుడు ఎవరో రానున్న కాలం నిర్ణయిస్తుంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: