మెగా బ్రదర్ నాగబాబు పట్ల గిల్టీగా ఫీల్ అయిన అతడి కొడుకు వరుణ్ తేజ్ ఒక నిర్ణయం తీసుకుని తనతండ్రికి షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. మెగా బ్రదర్స్ లో నాగబాబు నిర్మాతగా ఎదగాలని చాలప్రయత్నాలు చేసి ఆర్ధికంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీనితో తన సినిమా నిర్మాణానికి గుడ్ బై చెప్పి బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ తన హవాను కొనసాగిస్తున్నాడు. 

ముఖ్యంగా ‘జబర్దస్త్’ కార్యక్రమం నాగబాబుకు పేరుతో పాటు డబ్బును కూడ బాగా తెచ్చి పెట్టింది. మెగా కుటుంబ హీరోల వారసత్వం మొదలు అయ్యాక నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా అతితక్కువ కాలంలో యంగ్ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. 

ఈనేపధ్యంలో ఈమధ్య వరుణ్ తేజ్ హీరోగా ప్రారంభమైన శ్రీనువైట్ల సినిమా ‘మిస్టర్’ సినిమా ప్రారంభోత్సవం రోజున ఒక ఆసక్తికర సంఘటన జరిగింది అని టాక్. ఈసినిమా ప్రారంభోత్సవానికి నాగబాబు ఒక చిన్న కారులో వస్తే ఆసినిమా దర్శకుడు శ్రీనువైట్ల చాల ఖరీదైన కారులో రావడం మీడియా దృష్టిని ఆకర్షించింది. దీనితో కొన్ని మీడియా వర్గాలు సినిమా హీరో తండ్రి సినిమా దర్శకుడు స్థాయి కంటే ఖరీదు తక్కువైన చిన్నకారులో వచ్చాడు అంటూ కొన్ని మీడియా వర్గాలు కామెంట్ చేసినట్లు టాక్.

ఈకామెంట్స్ వరుణ్ తేజ్ దృష్టి వరకు రావడంతో ఈయంగ్ హీరో తన తండ్రి కోసం ఖరీదైన కారును కూడా కొన్నట్లు టాక్. అది మామూలూ ఆశామాషీ కారు కాదు కోటికి పైగా విలువ చేసే లగ్జరీ ‘రోల్స్ రాయిస్’ కారు అని అంటున్నారు. ఇలాంటి కారు ఇప్పటి వరకు చిరంజీవి వద్ద మాత్రమే ఉంది. గతంలో రామ్ చరణ్ కూడ తన తండ్రి చిరంజీవి కోసం ఇలాంటి ఖరీదైన కారును కొని బహుమతిగా ఇచ్చాడు. ఈవిషయంలో చరణ్ ను అనుసరిస్తూ వరుణ్ తేజ్ కూడ తానేమి తక్కువ కాదు అని తెలిసి వచ్చేవిధంగా ఇలాంటి ఖరీదైన బహుమతి ఇచ్చి తన తండ్రికి షాక్ ఇచ్చాడనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: