‘సరైనోడు’ సూపర్ సక్సస్ తో మంచి జోష్ మీద ఉన్న అల్లు అరవింద్ కు రామ్ చరణ్  నుండి అనుకోని షాక్ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం రామ్ చరణ్ కు తన సినిమాల విషయాలకన్నా తన తండ్రి చిరంజీవి 150వ సినిమా విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనితో ఇప్పటికే ముందుగా ప్లాన్ చేసుకున్న ‘థని ఒరువన్’ బిగ్ షెడ్యూల్ కు రామ్ చరణ్ డుమ్మా కొట్టాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఈనెల 3 నుంచి కాశ్మీర్ లో  ఒక భారీ షెడ్యూల్ ను దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేస్తే చరణ్ తాను చాల బిజీగా ఉన్నాను అంటూ ఈ షెడ్యూల్ ను వాయిదా వేయించి దర్శకుడు సురేంద్ర రెడ్డి నిర్మాత అరవింద్ లకు చరణ్ ఆఖరి నిముషంలో షాక్ ఇచ్చాడు అని టాక్.

దీనికి కారణం చిరంజీవి నటిస్తున్న్ ‘కత్తిలాంటోడు’ అని అంటున్నారు. జూన్ నుంచి ప్రారంభం అవ్వబోతున్న ఈసినిమా ఏ లోకేషన్స్ లో తీయాలి ఏ నటీనటులను ఎంపిక చేయాలి షెడ్యూల్ ఎలా ప్లాన్ చేయాలి అన్న విషయాల పై చరణ్ దర్శకుడు వినాయక్ తో ఖాళీ లేకుండా చర్చలు జరుపుతూ ఉండటం వల్ల చరణ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

చరణ్ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ‘ధని ఒరువన్’ విడుదల అక్టోబర్ కు వాయిదా పడింది అని టాక్. మొదట్లో ఈసినిమాను వేగంగా పూర్తి చేసి ఆగష్టులో విడుదల చేద్దామని అనుకున్నా చిరంజీవి 150వ సినిమా ఇప్పుడు పట్టాలు ఎక్కడంతో చరణ్ నిర్ణయాలు మారిపోయాయి అని టాక్. అయితే చరణ్ లేకుండా ఈసినిమాలో నటిస్తున్న అరవింద్ స్వామి సంబంధించిన సీన్స్ అన్నీ పూర్తి చేసి చరణ్ వచ్చేడప్పటికి అంతా రెడీ చేయాలని దర్శకుడు సురేంద్ర రెడ్డి ఆలోచన అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: