తెలుగు ఇండస్ట్రీలో మకుఠం లేని మహరాజులా వెలిగిపోయిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్,ఏఎన్ఆర్ ల తర్వాత అంత గొప్ప ఇమెజ్ తెలుగు ఇండస్ట్రీలో సంపాదించింది ఒక్క చిరంజీవి అని అందరికీ తెలుసు. ఇక ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా కొనసాగుతుంది...ఈ తరుణంలో మెగా ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజను హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా చిరంజీవి పది సంవత్సరాల క్రితం రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. తర్వాత ఆ మెగా హీరోలు పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ లు మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోలుగా పైకి వచ్చారు..ఈ మద్యే మెగాస్టార్ మేనళ్లుడు సాయిధరమ్ తేజ, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.


ఇక సాయిధరమ్ తేజ మొదటి సినిమా రేయ్ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని థియేటర్లో సందడి చేయగా అది కాస్తా తుస్ మంది..కాకపోతే ఈ మొదటి సినిమా ఇదే అయినా దీని తర్వాత చేసిన చిత్రం ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా థియేటర్లో ప్రదర్శింపబడింది..అయితే ఈ సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత రేయ్ అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది..తర్వాత వచ్చిన చిత్రం ‘సుబ్రమన్యం ఫర్ సేల్’ కూడా మంచి విజయం సాధించింది. ఇక మనోడు మంచి సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ఈ రోజు ‘సుప్రీమ్’ చిత్రం థియేటర్లో సందడి చేస్తుంది.

సుబ్రమణ్యం ఫర్ సేల్


అయితే ఇప్పుడు మెగా కుర్రోడు విపరీతమైన టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తుంది..దీనికి కారణం గత సంవత్సరం నుంచి మెగా ఫ్యామిలీకి అస్సలు కలిసి రావడం లేదు..గత సంవత్సరం విడుదలైన ‘బ్రూస్ లీ’ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సంవత్సరం ఎన్నో అంచనాలు వేసుకొని ఉగాది పండుగ రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ థియేటర్లో సందడి చేయగా ఘోర పరాభవం పొందింది..రీసెంట్ గా అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ చిత్రం కూడా మిశ్రమ స్పందన రావడంతో ఇప్పుడు మెగా కుర్రోడు సాయిధరమ్ తేజ్ తన సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్లో పడ్డట్టు తెలుస్తుంది.


పిల్లా నువ్వులేని జీవితం


ఇక సినిమా మాత్రం అనుకున్న రేంజ్ లో ఖచ్చితంగా ఆడుతుందని మొదటి నుంచి చిత్ర యూనిట్ తెలుపుతూ వస్తున్నారు. కాకపోతే మొదటి రెండు చిత్రాల ప్రభావంతో ఎక్కువ పబ్లిసిటీ చేయకపోవడం సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోకుండా కూల్ గా రిలీజ్ అయ్యింది..మరి ఈ సినిమా మెగా ఫ్యామిలీకి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుంది మరికొద్ది సమయంలో తెలిసిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: