మరి కొద్ది గంటలలో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘సుప్రీమ్’ సినిమా పై ప్రేక్షకుల తీర్పు రాబోతోంది. అయితే ఈ తీర్పు రాకుండానే చిరంజీవి తన మేనల్లుడిని  ఆకాశానికి ఎత్తేశాడు. వివరాలలోకి వెళ్ళితే ఈరోజు విడుదల అయిన ‘సుప్రీమ్’ మూవీ ప్రివ్యూను చిరు తన కుటుంబ సభ్యులతో కలిసి నిన్న రాత్రి చూశాడు. 
 
సినిమా చూసిన వెంటనే  డాన్స్ లలో నువ్వు పర్ఫెక్ట్ కామెడీ సీన్స్ లో ఓకె అంటూ భుజం తట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు చిరంజీవికి ఆయన ఫ్యామిలీకి ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈసినిమా చూపించాడు. ఈసినిమా చూసిన తరువాత చిరంజీవి తన ‘అందం హిందోళం’ పాట రీమిక్స్ చేసి ‘సుప్రీమ్’ లో వాడిన తీరును చిరు మెచ్చుకున్నాడు అని టాక్. ఈసాంగ్ ఒరిజినల్ ఫీల్ ఏమాత్రం చెడకుండా చిత్రీకరించినందుకు మెగా స్టార్ మూవీ డైరెక్టర్ ను నిర్మాతను అభినందించాడు.  

అయితే ఈసినిమాలో ఉపయోగించిన ఈరీమిక్స్ సాంగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ పాట కోసం భారీ సెట్టింగ్స్ వేయడంతో పాటు వందల  మంది డ్యాన్సర్లను ఉపయోగించారు. అందరికీ చాలా కాస్ట్లీ  కాస్ట్యూమ్స్ వాడారు. దీనివల్ల ఈపాట చిత్రీకరించే సమయంలో రోజుకు 25 లక్షల దాకా ఖర్చయిందట. ఇంత భారీ ఖర్చుతో ఐదారు రోజులు పాటు ఈపాటను చిత్రీకరించారట. ఈమధ్య కాలంలో టాలీవుడ్లో వచ్చిన రిచెస్ట్ సాంగ్స్‌లో ఇదొకటని నిర్మాత దిల్ రాజ్ చెపుతున్నాడు. 

ఇక ఈపాటకు చిరంజీవి  ప్రశంసలు కూడ లభించాయి కాబట్టి మెగా అభిమానులు ఈపాటను చాలబాగా ఎంజాయ్ చేస్తారని అనుకోవాలి. ‘పటాస్’ లాంటి సూపర్ హిట్ తర్వాత అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సుప్రీమ్’ మీద ఉన్న అంచనాలు అనుగుణంగా ఈసినిమా హిట్ అయితే ఈ మెగా యంగ్ హీరోకు ఎదురు ఉండదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: