నిన్న రాత్రి విజయవాడలో జరిగిన ‘సరైనోడు’ సక్సస్ మీట్ లో అల్లుఅర్జున్ అనుసరించిన వ్యూహాత్మక ఎత్తుగడలకు మీడియా ప్రతినిధులు కూడ షాక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ కెరియర్ లో ఇప్పటి వరకు అతడు నటించిన ఏ సినిమాకు రానంత భారీ కలక్షన్స్ ఈసినిమాకు రావడంతో పాటు ఈ సినిమా ఇప్పటికే 60 కోట్ల నెట్ కలక్షన్స్ ను సాధించింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈ సక్సస్ ను తన అభిమానులతో పంచుకోవడానికి అల్లుఅర్జున్ ‘సరైనోడు’ యూనిట్ నిన్న తన సక్సస్ మీట్ ను అత్యంత ఘనంగా నిర్వహించింది.

అయితే ఈ సినిమాకు మీడియా వర్గాలలో వచ్చిన విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ కు షాక్ అయిన బన్నీ నిన్న జరిగిన సక్సస్ మీట్ లో ఆ నెగిటివ్ కామెంట్స్ ను తిప్పి కొట్టాలని నిశ్చయించుకుని ఈ సక్సస్ మీట్ ను విజయవాడలో పెట్టించాడు అనే గాసిప్పులు మొదట్లో వినిపించాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని నిన్న జరిగిన సక్సస్ మీట్ లో అల్లుఅర్జున్ కాని ఈ సినిమా దర్శక నిర్మాతలు కాని ఎవరిపైనా ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయ కుండా ఈ సక్సస్ మీట్ ను చాల హుందాగా నడిపించారు.

దీనితో అల్లుఅర్జున్ ఏమైనా నెగిటివ్ గా మాట్లాడితే వెంటనే టార్గెట్ చేద్దామని ఉత్సహంతో వచ్చిన కొన్ని మీడియా వర్గాలకు బన్నీ ఆఖరి నిముషంలో తీసుకున్న ట్విస్ట్ షాక్ ఇచ్చినట్లు టాక్. అయితే ఇలా బన్నీ వ్యవహరించడానికి ఒక ఆ సక్తికర కారణం ఉంది అని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతున్న నేపధ్యంలో అనవసరంగా ఇప్పుడు తన సినిమా పై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ ను గుర్తుకు చేసి మరింత రచ్చ పెంచు కోవడం ఇష్టం లేక బన్నీ ఈ విధంగా తెలివిగా వ్యవహరించాడు అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 

ఇక ఈ వార్తలు ఇలా ఉండగా ‘సరైనోడు’ స్పీడ్ కు ‘సుప్రీమ్’ బ్రేక్ వేయడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈరోజు విడుదలైన ‘సుప్రీమ్’ కు పాజిటివ్ టాక్ వచ్చిన నేపధ్యంలో ‘సరైనోడు’ హవా ఖచ్చితంగా తగ్గుతుందని విశ్లేషకుల భావన..  


మరింత సమాచారం తెలుసుకోండి: