సినిమా ఇండస్ట్రీలో వస్తే సొసైటీలో సెలబ్రెటీలుగా మారడం సహజం..ఇక మంచి పాత్రలు రావడం గుర్తింపు వచ్చిందంటే వారికి పట్టపగ్గాలు ఉండవు. అంతే కాదు వారి జోష్ అంతా ఇంతా కాదు. ఎంజాయ్ మెంట్ లో తెలిపోతూ సర్వ సుఖాలు అనుభవిస్తుంటారు. తాజాగా ఓ హాస్యనటీమణి ఈ మద్య తెలుగు,తమిళ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించింది. ఇంతకీ ఎవరా నటీ అనుకుంటున్నారా.. విద్యుల్లేఖా రామన్. బొద్దుగా ముద్దుగా చిత్రవిచిత్రంగా మాట్లాడుతూ కనిపించే ఈ అమ్మడు తెలుగు,తమిళ సినిమాల్లో కామెడీ రోల్స్ చేస్తూ స్టార్ కమెడియన్ గా ఎదిగింది. ఇప్పుడు ఈ అమ్మడు విదేశాల్లో పెద్ద చిక్కుల్లో పనట్లు తెలుస్తుంది.

వివరాల్లోకి వెళితే..విద్యుల్లేఖా తన ఫ్రెండ్స్ తో కలిసి  ఆస్ట్రియాలోని వియన్నా వెళ్ళింది. అక్కడే ఓ హోటల్ లో బసచేశారు. హ్యాపీగా షికారు చేసి హోటల్ కి రాగాగానే ఆమె తన బ్యాగును పోగొట్టుకుందట. అందులో ఆమె పాస్ పోర్టు, క్రెడిట్ కార్డులు, డబ్బు వంటి విలువైనవన్నీ ఉండడంతో ఇబ్బందుల్లో పడింది. వెంటనే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన ట్విట్టర్ ద్వారా తనకు సాయం చేయాల్సిందిగా కోరుతూ ప్రధాని మోడీకి, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు ట్వీట్ చేసింది. అంతే కాదుతాను బసచేసిన హోటల్ కి ఎవరో వచ్చి అడ్రస్ అడిగి తన మిస్ గైడ్ చేశారని ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి తన బ్యాగ్ ఎత్తుకెళ్లినట్లు తన ట్విట్టర్ లో పేర్కొంది.

హీరో సూర్య,అల్లు అర్జున్ తో విద్యుల్లత రామన్


హోటల్ లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించాలన్న తన విజ్ఞప్తిని హోటల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని, అలాగే ఇక్కడి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పుకొచ్చింది. అయితే భారత అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకొని విద్యుల్లేఖా ను  సురక్షితంగా ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: