మెగాహీరోలలో ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించే హీరో సాయి ధరమ్ తేజ్. ప్రతి మూవీకి మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన స్టార్ డంని పెంచుకుంటూ వెళుతున్నాడు. నీరసించే కథలని సెలక్ట్ చేసుకోకుండా, పూర్తి కమర్షియల్ ఫార్ములాతో సాయి ధరమ్ తేజ్ దూసుకుపోతున్నాడు. ఆ విధంగా వచ్చిన లేటెస్ట్ ఫిల్మ్ సుప్రీమ్. ‘పటాస్‌’తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్ మూవీ, ప్రస్తుతం థియోటర్స్ వద్ద హల్ చేస్తుంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన మెగా మూవీలు అన్నీ వరుసగా థియోటర్స్ వద్ద బోల్తాపడటంతో...సుప్రీమ్ మూవీ మాత్రం ప్రేక్షకులకి కొంత ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చిందని చెప్పవచ్చు. సుప్రీమ్ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్ కి, ఈ మూవీ మంచి సక్సెస్ ని ఇచ్చిందని అంటున్నారు. ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇది చిన్న కథే అయినప్పటికీ..హీరో,హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ ప్రేక్షకులను కట్టిపడేంది.

సాయిధరమ్ తేజ్ ఫుల్ ఎనర్జిటిక్ గా ఇందులో నటించాడు. కథకు కీలకంగా మారిన బాల నటుడు మైఖేల్ గాంధీ ఈ మూవీ సక్సెస్ కి కారణం అయ్యాడు. మొత్తంగా సుప్రీమ్ మూవీ సాయి ధరమ్ తేజ్ కి మంచి సక్సెస్ ని ఇచ్చిందని అంటున్నారు. బ్రూస్ లీ, సర్ధార్ గబ్బర్ సింగ్, సరైనోడు వంటి నిరుత్సాహ చిత్రాల తరువాత వచ్చిన సుప్రీమ్...మెగా ప్రేక్షకులను బాగా అలరించిందని అంటున్నారు.

ఈ మూవీతో సాయిధరమ్ తేజ్ మార్కెట్ మరికొంత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. నిర్మాత సైతం సుప్రీమ్ మూవీ టాక్స్ పై హ్యాపీగా ఉన్నాడని తెలుస్తుంది. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: