ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న దర్శకుల్లో విక్రం కుమార్ ఒకరు. చేసే ప్రతి సినిమాలో ఓ కొత్త కథా వస్తువుతో ప్రేక్షకులను అలరిస్తున్న విక్రం కుమార్ సూర్యతో 24 సినిమా చేశాడు. విక్రం ఎలా నారేట్ చేసుంటే అర్ధగంట కథ చెప్పడానికి ఇచ్చిన టైం కాస్త నాలుగు గంటల సమయం ఇచ్చాడు. సూర్యకు అంతబాగా నచ్చబట్టే సినిమా నిర్మాణ బాధ్యతలను కూడా తన మీద వేసుకున్నాడు.


అయితే సూర్య, విక్రం కుమార్ ల 24 సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సూర్య మరోసారి తన నట విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించాడని తెలుస్తుంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా సీక్వల్ కూడా తీసే ఆలోచనలో ఉన్నాడట విక్రం కుమార్. అయితే సీక్వల్ చేసేది రేపు సినిమా టాక్ ను బట్టి నిర్ణయిస్తారట.


అంతేకాదు ఈ 24 సినిమాను హిందిలో కూడా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే హృతిక్ తండ్రి రాకేశ్ రోషన్ ఈ సినిమాపై చర్చలు జరుపుతున్నారట. బాలీవుడ్ లో ఎలా ఉన్నా సౌత్ లో మాత్రం 24 సినిమా సీక్వల్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు దర్శకుడు. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటించిన సూర్య 24లో సూర్య త్రిపాత్రాభినయం చేయడం విశేషం. 


యూ.ఎస్ లో ఇప్పటికే ప్రీమియర్ షోల రూపంలో సినిమా షోస్ పడుతున్నాయి. మరి రేపు రిలీజ్ అవుతున్న 24 ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: